Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కు శంకుస్థాపన చేసిన 'కింగ్' నాగార్జున..!

By:  Tupaki Desk   |   26 Dec 2020 12:30 PM GMT
జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కు శంకుస్థాపన చేసిన కింగ్ నాగార్జున..!
X
నిన్న కిష్మస్ సెలబ్రేషన్స్ లో ఫ్యామిలీతో గడిపిన టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ శ్రీధర్ రావుతో కలిసి పాల్గొన్నారు నాగ్. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం నాగార్జున శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీరారు. ఒక చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాగ్ కాసేపు కబుర్లు చెప్పారు. ఇక కాలనీ వాసులతో మాట్లాడిన నాగార్జున చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

కాగా, కింగ్ నాగార్జున ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర పై హోస్ట్ గా సందడి చేశారు. నాగ్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్' తెలుగు సీజన్-4 రియాలిటీ షో అత్యధిక టీఆర్పీతో సక్సెస్ ఫుల్ గా సాగిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నాగ్ ఇటీవలే తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేశాడు. అహిసోర్‌ సోల్మన్‌ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌ గా నాగార్జున కనిపించనున్నారు. దీనితోపాటు చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్‌ లో 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఏసియన్ వారి నిర్మాణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా నాగార్జున నటించనున్నారు.