Begin typing your search above and press return to search.

'కుక్క మొరిగిందనుకో'.. పోసాని వ్యాఖ్యలపై మెగా బ్రదర్ స్పందన..!

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:18 AM GMT
కుక్క మొరిగిందనుకో.. పోసాని వ్యాఖ్యలపై మెగా బ్రదర్ స్పందన..!
X
మెగా ఫ్యామిలీ గురించి ఎవరు విమర్శలు చేసినా మెగా బ్రదర్ నాగబాబు వారికి కౌంటర్ ఇవ్వడం అనేక సందర్భాల్లో చూశాం. ముఖ్యంగా సోదరులు చిరంజీవి - పవన్ కళ్యాణ్ లను ఒక్క మాట అన్నా.. వెంటనే తనదైన శైలిలో సందిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా నాగబాబు అగ్రెసివ్ గా కాకుండా సౌమ్యంగా సమాధానాలు ఇస్తున్నారు. అలానే ఇన్‌స్టాగ్రామ్ చిట్ చాట్‌ లో పాల్గొంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఫన్నీ మీమ్స్ తో జవాబులు ఇస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెర్సెస్ ఏపీ మంత్రులు మరియు పోసాని కృష్ణ మురళి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. పోసాని ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో నాగబాబు ఇన్స్టాగ్రామ్ లో ‘ఆస్క్‌ మీ’ అంటూ చిట్ చాట్ పెట్టాడు. పవన్ మీద పోసాని అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడిన నేపథ్యంలో నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇస్తారని ఫ్యాన్స్ భావించారు.

అయితే నాగబాబు దీనికి భిన్నంగా అడిగిన దానికి సూటిగా చెప్పకు.. మీమ్స్ ఎమోజీలు వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు. 'మళ్లీ పాలిటిక్స్‌ లోకి వస్తారా అంకుల్‌' అనే ప్రశ్నకు.. 'నాకు ఇంట్రెస్ట్‌ పోయింది' అనే మీమ్‌ తో జవాబు ఇచ్చారు. 'పోసాని గురించి ఒక్క మాట' అని అడుగగా.. ‘సమరసింహారెడ్డి’ లో ‘కుక్క మొరిగిందనుకో’ అని బాలయ్య చెప్పే సన్నివేశం ఫొటో పోస్ట్‌ చేశారు. 'పవన్‌ స్పీచ్‌ పై మీ స్పందన ఏమిటి?' అని ప్రశ్నించగా.. ‘కింగ్‌’ చిత్రంలో బ్రహ్మానందాన్ని శ్రీహరి కొట్టిన తీరును శ్రీనివాసరెడ్డి వివరించే వీడియోని పోస్ట్‌ చేశారు.

'పవన్‌ కల్యాణ్‌ మేటర్‌ మాట్లాడు అన్నా' అని ఓ నెటిజన్ అడిగితే.. గతంలో పవన్‌ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 'పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాంక్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు. అతను ఐదు కోట్లు, పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు'' అని పోసాని ఈ వీడియోలో మాట్లాడారు. 'మీరు ఏ బ్రాండ్‌ తాగుతారు?' అంటే.. ఆంధ్రప్రదేశ్ లో దొరికే 'ప్రెసిడెంట్‌ మెడల్‌ - ఆంధ్రా గోల్డ్‌ - గెలాక్సీ - బూమ్‌ బూమ్‌' వంటి బ్రాండ్స్ ఫొటోలను పోస్ట్‌ చేశారు.

‘ఏపీ మూవీ టికెట్స్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడుగగా.. ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ - బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సీన్ ని పోస్ట్‌ చేశారు. 'ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు మీడియాలో కనిపించడానికి పీకే ని విమర్శిస్తున్నారంట?' అని అడిగితే.. 'బయట టాక్' అని అతడు సినిమాలోని బ్రహ్మానందం ఫోటో పెట్టారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే.. 'న్యూస్ ఛానల్స్ చూడటం మానేసేయ్ బ్రో' అని నాగబాబు అన్నారు. 'పెయిడ్ మీడియా గురించి మీ ఒపీనియన్' అని ఓ నెటిజన్ అడుగగా.. 'పెయిడ్ మీడియా అని తెలిసీ మీరెందుకు పే చేసి మరీ ఆ పెయిడ్ న్యూస్ చూస్తున్నారు' అని నాగబాబు సమాధానం ఇచ్చారు.

ఇక 'పేర్ని నాని గురించి మీరేమనుకుంటున్నారు?' అనే ప్రశ్నకు ఆయన మహానటుడనే ఉద్దేశంతో మీమ్ పోస్ట్ చేసారు. 'గుండెళ్లో గోదారి' ఆడియో ఫంక్షన్‌ లో మోహన్‌బాబు 'నేను ఏం చెప్పాలి.. భారతదేశంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు వస్తాయి. ఆస్కార్‌ కి కూడా వెళ్లే అవకాశం ఉంది..' అని చెప్పిన వీడియోని నాగబాబు సమాధానంగా ఉపయోగించారు.