Begin typing your search above and press return to search.

దుబాయ్ లో ఇండియా, పాక్ మ్యాచ్ ను వీక్షించిన నాగబాబు, వరుణ్

By:  Tupaki Desk   |   25 Oct 2021 3:53 AM GMT
దుబాయ్ లో ఇండియా, పాక్ మ్యాచ్ ను వీక్షించిన నాగబాబు, వరుణ్
X
సాధారణంగా ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే, స్టేడియంలో వెంకటేశ్ సందడి చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న దుబాయ్ ఇంటెర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా - పాక్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరుగుతూ ఉండగా, నాగబాబు - వరుణ్ తేజ్ స్టేడియంలో సందడి చేస్తూ కనిపించారు. ఇటీవల ప్రారంభమైన టి 20 వరల్డ్ కప్ నిన్న కీలకమైన స్థాయికి చేరుకుంది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా - పాక్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు జట్లమధ్య పోరును కోట్లాది మంది అభిమానులు తిలకించారు.

ఈ మ్యాచ్ నాగబాబు - వరుణ్ తేజ్ ప్రత్యక్షంగా చూస్తూ ఎంజాయ్ చేశారు. 'బ్రోకెన్ బ్రదర్స్ వార్' అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు చాలా సీరియస్ గా ఆటను చూస్తుంటే, వరుణ్ తేజ్ తన ఫోన్ ద్వారా క్యాప్చర్ చేశాడు. ఈ ఫోటోను నాగబాబు షేర్ చేశారు. తండ్రీ కొడుకులు ఇలా దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమై సందడి చేయడం, మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. నాగబాబు - వరుణ్ తేజ్ తండ్రీ కొడుకులుగా కాకుండా స్నేహితులుగానే కనిపిస్తుంటారు. తన తండ్రిని సాధ్యమైనంత సంతోషంగా ఉంచడానికి వరుణ్ తేజ్ ప్రయత్నిస్తుంటాడు. ఇక నాగబాబు కూడా సాధ్యమైనంత వరకూ ఉల్లాసంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ షూటింగు పార్టును పూర్తి చేసుకున్న 'గని' విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. సయీ మంజ్రేకర్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో సినిమాగా 'ఎఫ్ 3' రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది. 'ఎఫ్ 2' సీక్వెల్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.