Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా అప్డేట్ ఎప్పుడో చెప్పిన నాగ్ అశ్విన్..!

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:45 AM GMT
ప్రభాస్ సినిమా అప్డేట్ ఎప్పుడో చెప్పిన నాగ్ అశ్విన్..!
X
'మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో 21వ చిత్రంగా రానున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తారని ప్రకటించారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని తీసుకున్నారు. అలానే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రలో నటిస్తారని వెల్లడించారు. 'రాధే శ్యామ్' మూవీ పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అయితే అదే సమయంలో ప్రభాస్ 'ఆదిపురుష్' అనే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ప్రకటించడంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై అనేక అనుమానాలు రేకెత్తాయి.

అంతేకాకుండా ప్రభాస్ 'ఆదిపురుష్‌' చిత్రాన్ని 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించడమే కాకుండా 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ తో 'సలార్' అనే పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండకపోవచ్చని.. అసలు ఉండకపోవచ్చనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రభాస్ తో చేయబోయే సినిమాపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. 'ప్రభాస్ సినిమా నుంచి న్యూ ఇయర్ లేదా పొంగల్ కి అప్డేట్ ఉందా?' అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు. 'పొంగల్ తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుందని.. వర్క్ ఫుల్ ఫ్లో లో నడుస్తోందని' నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చినట్లైంది.