Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ జంట దర్శనం

By:  Tupaki Desk   |   26 Jan 2016 5:37 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ జంట దర్శనం
X
భారీ చిత్రాల నిర్మాత అశ్వనీ దత్ కు కూతుళ్లలో పెద్దామె పేరు ప్రియాంక దత్. టెలివిజన్ రంగంలో సత్తా చాటుతున్న ఈమె పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. త్రీ ఏంజెల్స్ అనే బ్యానర్ పై బాణం - ఓం శాంతి - సారొచ్చారు వంటి చిత్రాలను నిర్మించింది కూడా. ఆ తర్వాత చెల్లెళ్లతో కలిసి స్వప్న సినిమాస్ అనే బ్యానర్ ను ప్రారంభించి ఎవడే సుబ్రమణ్యం మూవీని కూడా తీశారు.

ఆ మూవీ నిర్మాణ సమయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రియాంక దత్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ పెళ్లిపీటలకు కూడా చేరుకుంది. ఇరు కుటుంబాల వైపు నుంచి అంగీకారంతో, పెద్దల మద్దతుతో గతేడాది పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడా కలిసి కనిపించలేదు ఈ జంట. ఇప్పుడు హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుక.. ఈ జంట కలిసి కనిపించడానికి వేదిక అయింది. తొలిసారిగా ఇలా మీడియా ముందుకు వచ్చి కనిపించారు ఈ ప్రేమ జంట.

గతేడాది డిసెంబర్ 6న వీరిద్దరూ పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి జరిగి 50 రోజులు గడిచినా ఎక్కడా కనిపించని ఈ జంట.. తొలిసారిగా ఇలా ఫోటోలకు చిక్కారు. పెయిర్ ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ.. ఇతర సెలబ్రిటీలు అంతా పొగడ్తల్లో ముంచెత్తారు.