Begin typing your search above and press return to search.

`పోకిరి` ఇలియానాలా మ‌హేష్ తో జూ.ఇలియానా..!

By:  Tupaki Desk   |   6 Sep 2021 8:43 AM GMT
`పోకిరి` ఇలియానాలా మ‌హేష్ తో జూ.ఇలియానా..!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా 28వ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. `అత‌డు`.. `ఖ‌లేజా` త‌ర్వాత ముచ్చ‌ట‌గా హ్యాట్రిక్ కోసం మూడ‌వ‌సారి చేతులు క‌లిపారు. మ‌హేష్ స‌క్సెస్ స్పీడ్... త్రివిక్ర‌మ్ ఇండస్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ రికార్డుల‌ న‌డుమ ఈ కాంబినేష‌న్ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ న‌టీన‌టులు..సాంకేతిక నిపుణుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే మహేష్ స‌ర‌స‌న‌ మెయిన్ లీడ్ కి పూజా హెగ్డేని ఎంపిక చేసారు. ఈ నేప‌థ్యంలో ఇందులో మ‌రో హీరోయిన్ గా న‌భా న‌టేష్ ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

అదే నిజ‌మైతే న‌భా కెరీర్ ట‌ర్న్ తీసుకోవ‌డం ఖాయం. అగ్ర హీరోల స‌ర‌స‌న ఛాన్స్ కోసం న‌భా ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోంది. `డిస్కోరాజా` చిత్రంలో మాస్ రాజా ర‌వితేజ స‌ర‌స‌న న‌టించినా ఆ సినిమా వైఫ‌ల్యం వ‌ల్ల‌ న‌భా ఆ త‌ర్వాత త‌డ‌బాటుతో నెట్టుకురాలేక‌పోయింది. పైగా ఇప్ప‌టివ‌ర‌కూ మీడియం హీరోల స‌ర‌స‌నే కొన్ని సినిమాలు చేసింది. ట్యాలెంట్ డె గాళ్ అయినా పూరి జ‌గ‌న్నాథ్ సైతం `ఇస్మార్ట్ శంక‌ర్` లో కొంత వ‌ర‌కే ప‌రిమితం చేసారు. దీంతో అమ్మ‌డు త‌న‌లో సిస‌లైన న‌టిని బ‌య‌ట‌కు తీసే పుల్ లెంగ్త్ స్కోప్ త‌న‌కు ద‌క్క‌లేదు. మ‌రి త్రివిక్ర‌మ్ అయినా సెకెండ్ లీడ్ లో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర ఇస్తారేమో చూడాలి.

ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ యూత్ స్టార్ నితిన్ స‌ర‌స‌న `మాస్ట్రో`లో న‌టిస్తోంది. ఇందులోనూ సెకెండ్ లీడ్ త‌ర‌హాలోనే క‌నిపించ‌నుంది. మెయిన్ గా విల‌న్ షేడ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తోంది. ఆ ర‌కంగా న‌భా నటేష్ ఇప్ప‌టివ‌ర‌కూ సెకెండ్ లీడ్ ల‌కే ప‌రిమిత‌మైంది. క‌నీసం ఇప్ప‌టికి అయినా మాయావి చిత్రంలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తుందేమో చూడాలి. మ‌హేష్ తో క‌లిసి న‌టించ‌డం కాబ‌ట్టి ఫోక‌స్ అయ్యే అవ‌కాశం ఎక్కువగా ఉంది.

మ‌హేష్ స‌ర‌స‌న‌ జాన్వీ అనుకుంటే..!

ప్ర‌తిసారీ రొటీన్ హీరోయిన్ల‌తో మ‌హేష్ విసిగివేసారిపోయారని క‌థ‌నాలొచ్చాయి. అయితే పూజా హెగ్డే లేదంటే కియరా అద్వాణీ కుద‌ర‌క‌పోతే ర‌ష్మిక మంద‌న‌ పేర్లు మాత్ర‌మే వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ ఇప్ప‌టికే మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా న‌టించేశారు.
కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అనే నేను చిత్రంలో కియ‌రా న‌టించ‌గా.. పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌. మ‌హేష్ ఆ ముగ్గురితో ఇప్ప‌టికే రొమాన్స్ చేసేశారు కాబ‌ట్టి ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో సినిమా కోసం మ‌రో కొత్త క‌థానాయిక‌ను తీసుకోవాల‌నుకున్నారు.

ఆ క్ర‌మంలోనే జాన్వీ క‌పూర్ ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్ర‌య‌త్నాల్లో ఉందని క‌థ‌నాలొచ్చాయి. జాన్వీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేస్తే వెంట‌నే లాంచ్ చేయడ‌మేన‌ని కూడా అన్నారు. మ‌హేష్ లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశాన్ని బోనీకపూర్ కూడా ఎంక‌రేజ్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదని ప్ర‌చార‌మైంది.

కానీ త్రివిక్ర‌మ్ మాత్రం బుట్ట బొమ్మ పూజా హెగ్డే వైపు చూసారు. కియ‌రా ఇత‌ర భారీ చిత్రాల‌తో బిజీ అవ్వ‌డం.. జాన్వీ కపూర్ బిజీ షెడ్యూల్స్ వ‌గైరా కార‌ణాల‌తో పూజానే ఫైన‌ల్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రేజీ చిత్రంలో మ‌రో నాయిక‌గా న‌భాని ఎంపిక చేయ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. న‌భా న‌టేష్ ని ఇప్ప‌టికే జూనియ‌ర్ ఇలియానా అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. పోకిరిలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించిన ఇలియానా తీరుగా.. ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.