Begin typing your search above and press return to search.

మైత్రి వారు సూపర్‌ స్టార్‌ కి మళ్లీ అడ్వాన్స్‌ ఇచ్చారట

By:  Tupaki Desk   |   5 May 2022 2:30 AM GMT
మైత్రి వారు సూపర్‌ స్టార్‌ కి మళ్లీ అడ్వాన్స్‌ ఇచ్చారట
X
టాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ వారు బడా స్టార్స్ దాదాపు అందరికి కూడా అడ్వాన్స్ లు ఇచ్చి బుక్‌ చేస్తున్నారు. ఇప్పుడు డేట్లు లేవు అంటున్నా కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా చేద్దాం అంటూ అడ్వాన్స్ అయితే తీసుకోండి అన్నట్లుగా ఎంతో కొంత ముట్ట జెప్ప తున్నట్లుగా తెలుస్తోంది. అలా ఎంతో మంది స్టార్స్ కు మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ లు ఇచ్చారు.

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వకు పలు నిర్మాణం జరుగుతున్నాయి. వచ్చే వారంలో విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇదే సమ్మర్ లో విడుదల కాబోతున్న అంటే సుందరానికి సినిమాను కూడా మైత్రి వారే నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు.. కృతి శెట్టి జంటగా కూడా మైత్రి మూవీస్ వారు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక చిరంజీవితో ఒక సినిమాను బాలకృష్ణ తో మరో సినిమాను కూడా మైత్రి మూవీస్ వారు ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఆ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇక పుష్ప 2 మైత్రి వారి బ్యానర్ లోనే రూపొందబోతుంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇలా ఇన్ని సినిమాలు లైన్ లో ఉంచిన మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్‌ కళ్యాణ్ తో కూడా ఒక సినిమాను చేసేందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందట. ఈ సినిమాలు కాకుండా మరి కొందరు యంగ్‌ హీరోలకు మరియు స్టార్‌ హీరోలకు కూడా మైత్రి వారు అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందని సమాచారం అందుతోంది. ఒక వైపు మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ సినిమా విడుదల కాకుండానే మళ్లీ మహేష్‌ కు అడ్వాన్స్ ఇచ్చారట.

ఇతర నిర్మాతలతో పోల్చితే మైత్రి మూవీ మేకర్స్ వారు పారితోషికం విషయంలో కాస్త ఎక్కువ ఇస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అందుకే వారి నిర్మాణంలో సినిమాను చేసేందుకు ప్రతి ఒక్క హీరో ఆసక్తిగా ఉంటాడు అనేది టాక్. సర్కారు వారి పాట సినిమాను వారి బ్యానర్‌ లోనే చేసిన మహేష్‌ బాబు మళ్లీ వారి బ్యానర్‌ లో చేసేందుకు గాను ఓకే చెప్పి అడ్వాన్స్ ను కూడా తీసుకున్నాడట.

సర్కారు వారి పాట సినిమా విడుదల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హాసిని హారిక బ్యానర్‌ లో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. జక్కన్న సినిమా తర్వాత మళ్లీ మైత్రి వారి తో కలిసి మహేష్‌ సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి మైత్రి వారు రాబోయే రెండేళ్లలో టాలీవుడ్‌ లో రెండు పదుల సినిమాలను చేసేలా ఉన్నారు. కేవలం తెలుగులో కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా వీరు సినిమాలను నిర్మించేందుకు అక్కడ స్టార్‌ హీరోలకు కోట్లకు కోట్ల అడ్వాన్స్ లు ఇచ్చేందుకు సిద్దం గా ఉన్నారట. సల్మాన్ ఖాన్‌ తో వీరు ఒక సినిమా చేసేందుకు డేట్లు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.