Begin typing your search above and press return to search.

మహేష్ నిర్మాతలు అక్కడికెళ్తున్నారు

By:  Tupaki Desk   |   4 Feb 2016 11:30 AM GMT
మహేష్ నిర్మాతలు అక్కడికెళ్తున్నారు
X
హీరోలు - హీరోయిన్లు - దర్శకులు - మిగతా టెక్నీషియన్లు పరాయి భాషల్లోకి ప్రవేశిస్తున్నపుడు నిర్మాతలకు మాత్రం అడ్డేముంది చెప్పండి. అందుకే మైత్రీ మూవీస్ సంస్థ పక్క భాషలపైనా ఫోకస్ పెడుతోంది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి టాలీవుడ్ లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. త్వరలోనే కోలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. అక్కడ అజిత్ - విజయ్ - సూర్య లాంటి బడా స్టార్లతో సంప్రదింపులు జరుపుతున్న ఈ సంస్థ.. ఒకరి తర్వాత ఒకరితో సినిమాలు మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అల్టిమేట్ స్టార్ అజిత్ కాల్ షీట్లను ఆ సంస్థ సంపాదించేసినట్లు సమాచారం.

మైత్రీ మూవీస్ వాళ్లు భారీ పారితోషకం ఆఫర్ చేయడంతో అజిత్ వాళ్లకు కాల్ షీట్లు ఇచ్చేశాడట. ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టుల తర్వాత మైత్రీ వాళ్లతో ఓ సినిమా చేయడానికి అంగీకారం చెప్పాడట అజిత్. విజయ్ - సూర్యలకు కూడా వాళ్ల మార్కెట్ స్థాయికి మించిన ఆఫర్ ఇస్తోందట మైత్రీ మూవీస్. ముందు హీరోల కాల్ షీట్లు తీసుకున్నాక ఆ తర్వాత కథ, దర్శకుడి కోసం వేట మొదలుపెట్టనుంది మైత్రీ మూవీస్. ఈ రోజుల్లో హీరోల డేట్లు దొరకడం అన్నిటికంటే ముఖ్యం. ఆ తర్వాత అన్నీ వాటంతట అవే సెట్టయిపోతాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ట్రాక్ రికార్డు ఉండటం.. యుఎస్ లో డిస్ట్రిబ్యూషన్ లో మంచి పేరు కూడా ఉండటం.. పారితోషకం కూడా భారీగా ఆఫర్ చేస్తుండటంతో మైత్రీ మూవీస్ తో సినిమా చేయడానికి తమిళ స్టార్లకు అభ్యంతరాలేమీ కనిపిస్తున్నట్లుగా లేదు.