Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ టాలీవుడ్ లో రీసౌండ్ ఇస్తోంది!

By:  Tupaki Desk   |   30 Oct 2022 2:30 AM GMT
స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ టాలీవుడ్ లో రీసౌండ్ ఇస్తోంది!
X
టాలీవుడ్ లో ఒక‌ప్పుడు ప్ర‌ముఖంగా వినిపించిన ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, ప‌ద్మాల‌యా స్టూడియోస్‌, క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, గీతా ఆర్ట్స్‌.. అయితే గ‌త కొంత కాలంగా ఈ సంస్థ‌ల్లో భారీ స్థాయి సినిమాల నిర్మాణం ఆగిపోవ‌డం.. సినిమాల నిర్మాణం త‌గ్గిపోవ‌డంతో కొత్త నిర్మాణ సంస్థ‌లు రంగ ప్ర‌వేశం చేశాయి. మునుపెన్న‌డూ లుని విధంగా యంగ్ హీరోల నుంచి స్టార్ ల వ‌ర‌కు అందనితో సినిమాలు నిర్మిస్తున్నాయి.

ఈ విష‌యంలో టాలీవుడ్ లో గ‌త కొంత కాలంగా ప్ర‌ముఖంగా వినిపిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్. మెగా స్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు ఈ సంస్థ ప్ర‌స్తుతం అంద‌రితో సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో టాప్ లీడింగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా నిలుస్తోంది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా రూపొందుతున్న 'మీట‌ర్‌' మూవీకి స‌హ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సంస్థ మెగా స్టార్ తో 'వాల్తేరు వీర‌య్య‌', బాల‌కృష్ణ‌తో 'వీర సింహారెడ్డి', విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఖుషీ', నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ 19వ సినిమాతో పాటు బ‌న్నీతో 'పుష్ప 2'ని నిర్మిస్తూ టాలీవుడ్ లో టాప్ లీడింగ్‌ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా అగ్ర‌స్థానంలో నిలిచింది.

అంతే కాకుండా చాలా మంది టాప్ స్టార్ల‌కు, టైర్ టు హీరోల‌కు అడ్వాన్స్ లు కూడా చెల్లించి వారి కోసం ఎదురుచూస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' మూవీని కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా 'ఉప్పెన‌' ద‌ర్శ‌కుడితోనూ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఇప్ప‌టికే అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. ఇదిలా వుంటే ఈ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని మ‌రో ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఓవ‌ర్ టేక్ చేయ‌బోతోంది.

ఈ సంస్థ‌కు ధీటుగా టాలీవుడ్ లో టాప్ స్టార్ల‌ల‌తో క్రేజీ ప్రాజెక్ట్ లకు శ్రీ‌కారం చుడుతూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. 'వెంకీ మామ‌'తో భారీ సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేసిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ త‌ర‌హాలోనే టాప్ స్టార్ల‌తో సినిమాలు చేస్తూ స్టార్ హీరోల‌కు, డైరెక్ట‌ర్ల‌కు, టాప్ టెక్నీషియ‌న్ ల‌కు అడ్వాన్స్ లు ఇస్తూ పోతోంది. రీసెంట్ గా 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకున్న ఈ సంస్థ ఊహించ‌ని హీరోల‌తో భారీ ప్రాజెక్ట్ ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'వినోదాయ సితం' రీమేక్ ని నిర్మించ‌బోతున్న విష‌యం తెలిసిందే. దీనితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ - మారుతిల క‌ల‌యిక‌లో రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీనే నిర్మిస్తోంది. వీటితో పాటు ప‌లు సినిమాల నిర్మాణంలోనూ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తూ టాలీవుడ్ లో త్వ‌ర‌లోనే టాప్ లీడింగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా అవ‌త‌రించ‌డం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.