Begin typing your search above and press return to search.

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. రేపు థియేటర్లలో ర్యాంపే..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 8:30 AM GMT
ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. రేపు థియేటర్లలో ర్యాంపే..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వీర సింహా రెడ్డి''. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇటీవల లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ తో ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది.

'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న ''వీర సింహారెడ్డి'' సినిమాపై నందమూరి అబిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ చేసిన ట్వీట్ ఈ మూవీపై మరింత హైప్ ఎక్కిస్తోంది.

'వీర సింహారెడ్డి' సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ కు బీజీఎమ్ అదిరిపోయిందంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. దీనికి తమన్ స్పందించారు. ''ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే బ్రదర్.. రేపు థియేటర్లలో ఉంటది ర్యాంప్ ర్యాంప్.. కొన్ని సీన్లు చూసా.. వామ్మో.. జై బాలయ్య'' అని మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

బాలయ్య - గోపీచంద్ మలినేని గత చిత్రాలైన 'అఖండ' మరియు 'క్రాక్' లకు ఎస్ఎస్ థమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంలో బీజీఎం మేజర్ రోల్ ప్లే చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు దర్శక హీరోల కాంబోలో వస్తున్న 'వీర సింహారెడ్డి' చిత్రానికి థమన్ అదే స్థాయిలో మ్యూజిక్ సమకూరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే థియేటర్స్ లో ర్యాంప్ అంటూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ గోపీచంద్ స్పందిస్తూ.. ''కుమ్మేయ్ బావా'' అని ట్వీట్ చేశారు.

కాగా, 'వీర సింహారెడ్డి' సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్‌ విలన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. లాల్ - నవీన్ చంద్ర - చంద్రిక రవి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని - వై రవిశంకర్‌ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్‌ చేస్తున్నారు.

''వీర సింహా రెడ్డి'' చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.