Begin typing your search above and press return to search.

ఇది మహేష్ తో నాలుగోసారి.. హిట్ కొడతాడా?

By:  Tupaki Desk   |   6 Jun 2020 3:45 AM GMT
ఇది మహేష్ తో నాలుగోసారి.. హిట్ కొడతాడా?
X
ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా ప్రకటన తాజాగా రావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. అసలు పరశురామ్ కి మహేష్ బాబుకి ఎలా కుదిరిందబ్బా.. అని అందరూ అనుకొని.. మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ఊహించుకుంటున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ సినిమా టైటిల్ తోనే సందేహాలు క్లియర్ చేసాడు పరశురామ్. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ ని ఎంచుకున్నారు చిత్ర యూనిట్. అయితే మహేష్ తో మళ్లీ తమన్ అనేసరికి అందరూ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎందుకంటే మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మధ్యలో హారిస్ జయరాజ్ వచ్చిన అది మురుగదాస్ సినిమా కాబట్టి ఓకే. ఇక ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరూ పై తమన్ వివాదంతో మళ్లీ ఈ కాంబినేషన్ కుదరదని అంతా అనుకున్నారు. కానీ తాజాగా సర్కారు వారి పాట కోసం తమన్ ఓకే అయ్యాడు. ఎందుకంటే తమన్ ఈ మధ్య దేవి కంటే ఇరగదీస్తున్నాడని అందరి భావన. అందుకు అల వైకుంఠపురంలో ఆల్బమ్ ఉదాహరణగా చెప్పాలి. ఇక గతంలో మహేష్ - తమన్ కాంబినేషన్లో బిజినెస్ మ్యాన్, దూకుడు, ఆగడు వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు నాలుగోసారి ఇద్దరు జతకడుతున్నారు. అయితే ఈ సినిమా పై కూడా గట్టి నమ్మకంతో ఉన్నారట మహేష్, పరశురామ్. పరశురామ్ తో కూడా శ్రీరస్తు శుభమస్తు చేసాడు తమన్. మరి ఈ హిట్ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. మహేష్ కి నాలుగో సూపర్ హిట్ ఇస్తాడా తమన్ అనేది వేచి చూడాలి!