Begin typing your search above and press return to search.

ర‌ణ‌భూమిలో అఘోరాగా ఎం.ఎస్.ధోనీ

By:  Tupaki Desk   |   3 Feb 2022 12:58 PM GMT
ర‌ణ‌భూమిలో అఘోరాగా ఎం.ఎస్.ధోనీ
X
బాహుబ‌లి ఫ్రాంఛైజీ పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా వార్ సినిమాలు వ‌చ్చాయి. కానీ అవేవీ బాహుబ‌లి అంత పెద్ద స‌క్సెస్ కాలేదు. ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు సాగుతూనే ఉన్నాయి. కొంద‌రు యానిమేటెడ్ వారియ‌ర్ సినిమాల్ని ప్ర‌య‌త్నిస్తున్నా ప‌న‌వ్వ‌డం లేదు. ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని స‌రికొత్త అవ‌తారం ఎత్తారు. అత‌డు న‌వ‌లా హీరోగా మారారు. అయితే ఇది యానిమేటెడ్ మూవీ. సినిమా టైటిల్ అథ‌ర్వ‌. అదే పేరుతో వ‌చ్చిన నవల దీనికి ఆధారం. రచయిత రమేష్ తమిళ్మణి రచనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ గ్రాఫికల్ వెబ్ సిరీస్ గా ప్రచారం ఉంది. ధోని ఎంటర్ టైన్ మెంట్ ప‌తాకంపై ఎం.ఎస్.ధోని స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత‌డి భార్య సాక్షి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌ల్ని చూసుకుంటున్నారు.

తాజాగా ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియాలో లాంచ్ చేసారు. యుద్ధభూమిలో యానిమేటెడ్ అవతార్ లో ధోని లుక్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఒక వారియ‌ర్ (అఘోరా) క్రూరులైన డెవిల్ సైన్యంతో పోరాడుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో ఆవిష్క‌రించారు. ``నా కొత్త అవతార్.. అథర్వ.. ప్రకటించినందుకు సంతోషంగా ఉంది`` అని ధోని ఫేస్ బుక్ లో పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చాడు.

``ఈ పుస్తకం ఒక పౌరాణిక సైన్స్ ఫిక్షన్... ఇది హైటెక్ సదుపాయంలో బంధించబడిన ఒక రహస్యమైన అఘోరీ ప్రయాణానికి అన్వేష‌ణ‌`` అని ధోని భార్య సాక్షి మునుపటి ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రాఫిక్ నవల నిర్మాణ బాధ్యతలను ఆమె స్వ‌యంగా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇంతకుముందు MS ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్ తో ఓ సినిమా వ‌చ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ధోని ఆ చిత్రానికి మద్దతునిచ్చి ప్ర‌చారం చేశారు. తాజాగా గ్రాఫిక్ నవల విశ్వంలో ధోని తొలి పాత్ర అథర్వ లుక్ వైర‌ల్ గా మారింది. ర‌ణ‌భూమిలో అఘోరా వారియ‌ర్ అవ‌తారాన్ని ఆద్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ చిన్న వీడియోలో చూపించారు. మిస్టీరియ‌స్ అఘోరి క‌థ అని చెబుతున్నారు కాబ‌ట్టి ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల‌తో ఈ సిరీస్ సాగుతుంద‌ని భావించ‌వ‌చ్చు.