Begin typing your search above and press return to search.

మ‌జ్ను ప్రేమ‌లో ఇంత మెలోడీనా?

By:  Tupaki Desk   |   6 Jan 2019 5:46 PM GMT
మ‌జ్ను  ప్రేమ‌లో ఇంత మెలోడీనా?
X
మెలోడీ బ్ర‌హ్మ అని మ‌ణిశ‌ర్మ‌ను అంటారు. కానీ ఈసారి ఆ బిరుదును ఆయ‌న శిష్యుడైన‌ థ‌మ‌న్ టేకోవ‌ర్ చేసేట్టే క‌నిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను` మెలోడీ అందుకు సింబాలిక్ గా క‌నిపిస్తోంది. ``నాలో నీకు నీలో నాకు సెలవేనా..`` అంటూ సాగే ఈ పాట‌కు అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు థ‌మ‌న్. అత‌డి మెలోడీలో మునుప‌టితో పోలిస్తే గ్రిప్ ఎక్కువే క‌నిపిస్తోంది. ఇక సాహిత్యం ప‌రంగానే గ‌మ్మ‌త్త‌యిన ప‌ద‌జాలాన్నే ఈ పాట‌లో ఉప‌యోగించారు.

థ‌మ‌న్ ఇటీవ‌లే ఇచ్చిన బాణీల్లో తొలిప్రేమ‌, అర‌వింద స‌మేత చిత్రాల‌కు ఎంతో స్పెష‌ల్ గా అల‌రించాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ `మిస్ట‌ర్ మ‌జ్ను` కోసం థ‌మ‌న్ గ్రౌండ్ వ‌ర్క్ బావుంద‌నే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ఇక ఇప్ప‌టికే అక్కినేని బుల్లోడు అఖిల్ న‌టిస్తున్న `మిస్ట‌ర్ మ‌జ్ను` పోస్ట‌ర్, టీజ‌ర్ తో అంచ‌నాలు పెంచింది. ఇటీవల విడుదలైన `ఏమైనదో ఏమైనదో పలుకు మరచినట్టు పెదవికేమైనదో..` అంటూ సాగే టైటిల్ పాట‌కు అభిమానుల నుంచి స్పంద‌న బావుంది. తాజాగా రిలీజ్ చేసిన `నాలో నీకు నీలో నాకు సెలవేనా` మెలోడీ గీతం ఆక‌ట్టుకుంది. శ్రేయా ఘోషాల్, కాళ భైరవ ఈ పాటను ఆలపించారు. నిధితో ప్రేమ‌లో ఏం చికాకులో ప‌రాకులో మ‌రీ ఇంత‌గా విర‌హ‌గీతం పాడేసుకున్నారు? ఈ సినిమాలోని పాటలన్నింటికీ శ్రీమణి లిరిక్స్ రాశారు.

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై `తొలిప్రేమ` ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ముగింపులో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న విడుదల చేయ‌నున్నారు.