Begin typing your search above and press return to search.

మ‌హేష్ మాల్‌ లో మ‌జ్ను షూట్‌

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:37 AM GMT
మ‌హేష్ మాల్‌ లో మ‌జ్ను షూట్‌
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్- థియేట‌ర్‌ బిజినెస్‌ లో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. బిలియ‌న్ డాల‌ర్ ప‌రిశ్ర‌మ‌లో తాను కూడా భాగం కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఏషియ‌న్ సునీల్ నారంగ్‌ తో క‌లిసి ఈ రంగంలో ప్ర‌వేశిస్తున్నారు. ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి ఏఎంబీ సినిమాస్ పేరుతో భారీ థియేట‌ర్ చైన్‌ ని ర‌న్ చేసేందుకు తొలి అడుగు వేస్తున్నారు. ముందుగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి ప‌రిస‌రాల్లో AMB సినిమాస్ మాల్‌ ని లాంచ్ చేస్తున్నారు. ఇందులో సుమారు 3000 సిట్టింగ్ కెపాసిటీతో 7 స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఈ మాల్ ఇప్ప‌టికే స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మైంది. వాస్త‌వానికి 2.ఓ సినిమాతో ఈ థియేట‌ర్లను లాంచ్ చేయాలని భావించినా.. కుద‌ర‌లేదు. దాంతో ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్స‌వాన్ని డిసెంబ‌ర్ 2కు వాయిదా వేసార‌ని తెలిసింది. ఆరోజు ప్రారంభోత్స‌వం చేసి - డిసెంబ‌ర్ 3 నుంచి షోలు వేస్తార‌ట‌.

మ‌రోవైపు అక్కినేని అఖిల్ న‌టిస్తున్న మిస్ట‌ర్ మ‌జ్ను షూటింగ్‌ ని ఈ మాల్‌ లో ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. మిస్ట‌ర్ మ‌జ్ను ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి 2019 సంక్రాంతి త‌ర్వాత‌ రిలీజ్ చేస్తార‌ని వార్త‌లొస్తున్నా.. దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. తాజా షెడ్యూల్ ఏఎంబీ సినిమాస్‌ లో తెర‌కెక్కిస్తున్నారు కాబ‌ట్టి ఈ మాల్‌ లో షూటింగ్‌ లో పాల్గొంటున్న తొలి హీరోగా అఖిల్ పేరు రికార్డులకెక్కుతోంది.

మిస్ట‌ర్ మ‌జ్ను టీజ‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై ఆక‌ట్టుకుంది. అక్కినేని బ్రాండ్ రోమియోగా అఖిల్ ఈసారి మైమ‌రిపించ‌బోతున్నాడ‌ని టీజ‌ర్ రివీల్ చేసింది. వ‌రుసగా రెండు అప‌జ‌యాలు అఖిల్ ని ఇబ్బంది పెట్టినా - ఈసారి మాత్రం త‌ప్ప‌నిస‌రిగా హిట్ కొడ‌తాడ‌ని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదివ‌ర‌కూ హైద‌రాబాద్ మెట్రో ట్రెయిన్ లో `హ‌లో` చిత్రం కోసం యాక్ష‌న్ స‌న్నివేశాలు తీశారు. తొలిసారి మెట్రో రైల్‌ లో న‌టించిన హీరోగానూ అఖిల్ ఘ‌నుతికెక్కాడు. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్‌ లోనూ అదే త‌ర‌హా ఫీట్ అఖిల్ వేస్తున్నాడన్న‌మాట‌. అక్కినేనీస్ కాంటాక్ట్స్ .. స్నేహ‌సంబంధాల‌తో ఇది ఇంత సులువుగా పాజిబుల్ అయ్యింద‌న్న‌మాట‌!