Begin typing your search above and press return to search.

కరోనా భయంతో షూటింగ్ ఆపేశారు

By:  Tupaki Desk   |   8 Feb 2020 3:30 PM GMT
కరోనా భయంతో షూటింగ్ ఆపేశారు
X
కలకలం రేపుతున్న కరోనా వైరస్ భయం భారత్ లోనూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ మూడు కేసులు మాత్రమే వెలుగు చూశాయి. ఆ మూడు కేరళలోనే కావటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నా.. ఆ రాష్ట్రానికి వెళ్లే వారు మాత్రం కాస్త ఆలోచనలో పడుతున్నారు. తాజాగా కరోనా కారణంగా హిందీ సినిమా షూట్ ను నిలిపివేసిన వైనం వెలుగు చూసింది.

ఈ మధ్యనే కరోనా కారణంగా నాగ్ మూవీ షూట్ ఆగిపోగా.. తాజాగా హిందీ మూవీని నిలిపివేశారు. వందనా కటారియా.. దర్శకురాలు రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కేరళలో జరగాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే కేరళలో మూడు కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా షూటింగ్ ను రద్దు చేసుకున్నారు. శోభితా ధూళిపాళ్ల ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ మూవీ భిన్నమైన సినిమాగా చెబుతున్నారు.

ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యమని..అందుకే షూటింగ్ ను క్యాన్సిల్ చేసినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. వాస్తవానికి షూటింగ్ జరిగే ఆలోచన జనవరి చివరి వారం వరకూ ఉంది. ఇందుకు తగ్గట్లే మూవీ డిజైనింగ్ టీం జనవరి 31 వరకు కేరళలోనే వర్క్ చేసింది. ఎప్పుడైతే ఒకటికి మూడు కేసులు వెలుగు చూశాయో.. వారుసైతం వెనక్కి రాగా.. షూటింగ్ నుకూడా క్యాన్సిల్ చేశారు.