Begin typing your search above and press return to search.

వైజాగ్ లో వాలిపోయిన 'మోసగాళ్ళు'

By:  Tupaki Desk   |   12 March 2021 7:46 AM GMT
వైజాగ్ లో వాలిపోయిన మోసగాళ్ళు
X
డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''మోసగాళ్ళు''. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. 'మోసగాళ్ళు మానియా' అనే కాంటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన వారికి సినిమా విడుదలవ్వక ముందే 10 నిమిషాల స్నీక్ పీక్ చూపిస్తామని విష్ణు ప్రకటించారు.

అయితే 'మోసగాళ్ళు మానియా' కాంటెస్ట్ విన్నర్స్ కి ఈరోజు వైజాగ్ లోని మెలోడీ థియేటర్ లో సాయంత్రం 5 గంటలకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 10 నిమిషాల స్నీక్ పీక్ ని విన్నర్స్ తో కలిసి చూడటానికి హీరో మంచు విష్ణు మరియు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవదీప్ వైజాగ్ లో వాలిపోయారు. 'మోసగాళ్ళు' బృందానికి ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించినట్లు తెలుస్తోంది.

కాగా, వాస్తవ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌‌ నేపథ్యంలో 'మోసగాళ్ళు' తెరకెక్కితోంది. ఇందులో విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించగా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. రుహీ సింగ్ హీరోయిన్ గా నటించగా.. నవీన్ చంద్ర ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. భారీ బడ్జెట్‌ తో హై టెక్నికల్ వాల్యూస్‌ తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచు విష్ణు కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.