Begin typing your search above and press return to search.

మ‌రిన్ని 'ది క‌శ్మీర్ ఫైల్స్'ని తెర‌పైకి తెస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   2 Sep 2022 6:39 AM GMT
మ‌రిన్ని ది క‌శ్మీర్ ఫైల్స్ని తెర‌పైకి తెస్తార‌ట‌!
X
అభిషేక్ అగ‌ర్వాల్ అర్ట్స్ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ తొలి సారి ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్న‌హోత్రితో క‌లిసి నిర్మించిన సంచ‌ల‌న మూవీ 'ది క‌శ్మీర్ ఫైల్స్‌'. కొన్నేళ్ల క్రితం క‌శ్మీర్ పండిట్ల‌పై జ‌రిగిన అవ‌మాన‌వీయ మార‌హోమం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. చిన్న సినిమాగా విడుద‌లై భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

ఈ మూవీతో టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ అభిషేక్ అగ‌ర్వాల్ బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. తొలి చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచారు.

రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి 'కార్తికేయ 2' వంటి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ అయామ్ బుద్ధ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి 'ది క‌శ్మీర్ ఫైల్స్' త‌ర‌హాలో దేశ వ్యాప్తంగా వున్న అన్ టోల్డ్ స్టోరీస్ ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

ఇందు కోసం ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు క‌లిసి ముంద‌కెళ్లాల‌ని వినాయ‌క చ‌విత సంద‌ర్భంగా చేత‌లు క‌లిపారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుని అగ్రిమెంట్ కు సంబంధించిన డాక్యుమెంట్ల‌పై సంత‌కాలు చేశారు. అభిషేక్ అగ‌ర్వాల్ తండ్రి తేజ్ నారాయ‌ణ్ స‌మ‌క్షంలో ఇరు సంస్థ‌ల‌కు సంబంధించిన అభిషేక్ అగ‌ర్వాల్‌, ప‌ల్ల‌వి జోషీ అగ్రిమెంట్ లు పూర్తి చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తాజా ఒప్పందానికి సంబంధించి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ స్పందించింది. 'ఈ ప‌విత్ర‌మైన రోజున మ‌న అంద‌మైన దేశంలోని ప్ర‌జ‌ల‌కు మ‌న మాతృభూమి గురించి క‌థ‌లు చెప్ప‌డానికి అయామ్ బుద్ధ ప్రొడ‌క్ష‌న్స్‌, వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, ప‌ల్ల‌వి జోషితో క‌లిసి మ‌రో ఉత్తేజ‌క‌ర‌మైన ప్రియాణాన్ని ప్రారంభిస్తున్నాం. జైహింద్' అని ట్వీట్ చేశారు.

ఈ ప‌విత్ర‌మైన రోజున అయామ్ బుద్ధ ఫౌండేష‌న్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ భార‌త్ లో ఎవ‌రికీ తెలియ‌ని క‌థ‌లు చెప్ప‌డానికి, భార‌తీయ పున‌రుజ్జీవ‌నానికి దోహ‌ద‌ప‌డేందుకు మ‌రోసారి చేతులు క‌లిపాయి' అని ప‌ల్ల‌వి జోషీ ట్వీట్ చేశారు. ఈ ముగ్గురు క‌లిసి త్వ‌ర‌లో ఎలాంటి రియ‌ల్ స్టోరీతో రాబోతున్నారో... ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెల‌ర‌లేప‌బోతున్నారో తెలియాలంటే మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.