Begin typing your search above and press return to search.

చరణ్‌ తమిళ దర్శకుడికి ఓకే చెప్పినట్లేనా?

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:58 PM GMT
చరణ్‌ తమిళ దర్శకుడికి ఓకే చెప్పినట్లేనా?
X
రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆ సినిమా కోసం ఇద్దరు కూడా మరే సినిమాలు కూడా చేయకుండా పూర్తిగా జక్కన్న కోసం కేటాయించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఎన్టీఆర్‌ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. కాని రామ్‌ చరణ్‌ మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ఆచార్య సినిమాలో చరణ్‌ గెస్ట్‌ రోల్‌ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత చరణ్‌ ఏ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పలువురు దర్శకులు మరియు రచయితలు ఇప్పటికే చరణ్‌ కు కథలు వినిపించారని.. ఆ దర్శకుడితో చరణ్‌ సినిమా.. ఈ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఎవరికి ఓకే చెప్పలేదు. తాజాగా చరణ్‌ తమిళ దర్శకుడు మోహన్‌ రాజా చెప్పిన ఒక కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ప్రముఖ దర్శకుడు అయిన ఎడిటర్‌ మోహన్‌ తనయుడు అయిన మోహన్‌ రాజా తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చకున్నారు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన తమిళ 'తనిఒరువన్‌' సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. అదే తెలుగులో ధృవ గా రీమేక్‌ అయ్యింది. చరణ్‌ కు దృవ సూపర్‌ హిట్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. ధృవ సినిమాకే మోహన్‌ రాజాతో చరణ్‌ వర్క్‌ చేయాల్సి ఉన్నా వీలు పడలేదు. ఇప్పుడు ఒక పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ తో చరణ్‌ ను మోహన్‌ రాజా ఒప్పించడం జరిగిందట. వచ్చే ఏడాదిలో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లుగా రాబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు మోన్‌ రాజా తనిఒరువన్‌ 2 సినిమాను కూడా చేస్తున్నాడు. దాన్ని తెలుగులో ధృవ 2 గా రీమేక్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.