Begin typing your search above and press return to search.

ఈ మెగా డైరెక్టర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ కు కారణం ఏంటో..!

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:46 AM GMT
ఈ మెగా డైరెక్టర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ కు కారణం ఏంటో..!
X
మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన దర్శకుడు మోహన్‌ రాజా తదుపరి సినిమా కోసం తమిళ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్ ఫలితం మరో విధంగా ఉండి ఉంటే ఇప్పటికే నాగార్జునతో మోహన్ రాజా సినిమా పట్టాలెక్కి ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.

నాగార్జున సినిమా దాదాపుగా క్యాన్సిల్‌ అయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌ రాజా తదుపరి సినిమా ఏంటి.. ఎవరితో అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో మోహన్ రాజా యొక్క సోషల్‌ మీడియా పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన కాస్త ఎమోషనల్‌ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తాజాగా సోషల్‌ మీడియా లో మోహన్‌ రాజా స్పందిస్తూ... హీరో దర్శకుడు అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ ను ప్రోత్సహిస్తూ ఉంటారు. భాష తో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల యొక్క సపోర్ట్‌ కంటిన్యూ అవుతుందన్నాడు.

హైదరాబాద్ లోని ఒక పెద్ద పార్టీ లో తాను ఉన్నాను అంటూ చెప్పుకొచ్చిన మోహన్‌ రాజా తన యొక్క తని ఒరువన్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని.. అలాగే తాను పలు సందర్భాల్లో తెలుగు ప్రేక్షకులచేత ఆశీర్వదించబడ్డాను అన్నట్లుగా కూడా పేర్కొన్నాడు.

ఉన్నట్లుండి ఎందుకు మోహన్‌ రాజా ఈ ట్వీట్‌ చేశాడు.. అది కూడా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి కాస్త ఎమోషనల్‌ గా మోహన్‌ రాజా కు ఎందుకు ట్వీట్ చేయాలి అనిపించింది అంటూ నెట్టింట మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మోహన్‌ రాజా తని ఒరువన్‌ సీక్వెల్‌ పనుల్లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

తని ఒరువన్‌ ను తెలుగు లో రామ్‌ చరణ్ ధృవగా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కనుక సీక్వెల్‌ పై తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.