Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' నుంచి మినీ పోస్ట్ పోన్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   26 April 2021 10:46 AM GMT
ఏక్ మినీ కథ నుంచి మినీ పోస్ట్ పోన్ అప్డేట్..!
X
సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ - మినీ టీజర్ - పాటలతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

కోవిడ్ నేపథ్యంలో ఈ నెల విడుదల కావాల్సిన 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించింది. హీరో సంతోష్ శోభన్ - కమెడియన్ సుదర్శన్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలో కరోనా కారణంగా అందరూ సేఫ్ గా ఉండాలని సూచిస్తూ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు మెరుగుపడ్డాక కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా, 'ఏక్ మినీ కథ' చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించగా.. బ్రహ్మాజీ - సుదర్శన్ - సప్తగిరి - హర్షవర్ధన్ ఇతర పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా .. సత్య ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.