Begin typing your search above and press return to search.

అల్లుడి కోసం మరోసారి మెగాస్టార్‌..!

By:  Tupaki Desk   |   1 Oct 2021 1:05 AM GMT
అల్లుడి కోసం మరోసారి మెగాస్టార్‌..!
X
సాయి ధరమ్‌ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్ గా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను ఇంతకు ముందు మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరించిన విషయం తెల్సిందే. రిపబ్లిక్ ట్రైలర్ విడుదల సమయంలోనే చిరంజీవి తన మేనల్లుడి ఆరోగ్యంకు మరియు సినిమాకు అభిమానుల మద్దతు ఆశీస్సులు కావాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ వేడుక కు సాయి ధరమ్‌ తేజ్ కోసం పవన్‌ కళ్యాణ్‌ హాజరు అయ్యాడు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న సాయి ధరమ్‌ తేజ్ కు మీ అందరి ఆశీస్సులు కావాలంటూ పవన్ కళ్యాణ్‌ రిపబ్లిక్‌ మూవీ పై అంచనాలు ఆసక్తి పెంచాడు. రిపబ్లిక్ మూవీ వార్తల్లో నిలిచేలా మెగా బ్రదర్స్ చేశారు. దాంతో సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది.

రిపబ్లిక్ మూవీ విడుదల రోజు వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రమోషన్స్ చేసింది ఒకటి.. నేడు సినిమా కు జనాల నుండి వచ్చే రెస్సాన్స్ ఒకటి. అందుకే విడుదల ముందు కూడా రిపబ్లిక్ సినిమా గురించి మెగాస్టార్‌ చిరంజీవి స్పందించాడు. ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి.. సాయి ధరమ్‌ తేజ్ కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశ్సీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తు.. ఆ చిత్ర యూనిట్‌ అందరిని నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎగ్జిబిషన్‌ సెక్టార్ కు రిపబ్లిక్ మూవీ విజయం కావాల్సినంత ధైర్యంను ఇస్తుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. చిరంజీవి ట్వీట్ తో మరోసారి సాయి ధరమ్‌ తేజ్ రిపబ్లిక్ మూవీ పై అంచనాలు ఆసక్తి పెరుగుతోంది.

సాయి ధరమ్‌ తేజ్ హాస్పిటల్‌ లో ఉండటం వల్ల ఆయన లేకుండానే సినిమా విడుదల అవుతోంది. సినిమా విడుదల కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక హీరో సినిమా ప్రమోషన్‌ లో పాల్గొనక పోతే చాలా డ్యామేజ్ ఉంటుంది. కాని మెగా హీరో ఒక్కరు ప్రచారంకు రాకున్నా మెగా ఫ్యామిలీ అంతా కూడా తామున్నాం అంటూ ముందుకు వచ్చారు. దాంతో రిపబ్లిక్ కు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మెగా స్టార్‌ చిరంజీవి ట్వీట్‌ తో రిపబ్లిక్ సినిమా ఖచ్చితంగా బూస్ట్‌ అవుతుందని మేకర్స్ మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.