Begin typing your search above and press return to search.

శర్వానంద్ కోసం ఖమ్మం రాబోతున్న మెగాస్టార్..!

By:  Tupaki Desk   |   8 March 2021 10:23 AM GMT
శర్వానంద్ కోసం ఖమ్మం రాబోతున్న మెగాస్టార్..!
X
టాలీవుడ్ యువహీరో శర్వానంద్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా నటించింది. అయితే మార్చ్ 11న శివరాత్రి సందర్బంగా శ్రీకారం మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సోమవారం శ్రీకారం చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నట్లు ఇప్పటికే శర్వానంద్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా మమత హాస్పిటల్ గ్రౌండ్ లో శ్రీకారం సినిమా వేడుక జరుగుతుండగా.. ఈ వేడుకకు మెగాస్టార్ చిరుతో పాటు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ముఖ్యఅతిథిగా రాబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. శ్రీకారం సినిమాతో కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సోమవారం సాయంత్రం 6గంటలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుండగా.. పాసెస్ ఉన్నవారికే లోనికి అనుమతి ఉంటుందని ఈవెంట్ మేనేజంగ్ సంస్థ శ్రేయాస్ మీడియా ప్రతినిధి తెలిపారు. అయితే పల్లెటూరు నేపథ్యంలో వచ్చే సినిమాలు శర్వానంద్ కు బాగా కలిసోస్తాయని టాక్. ఎందుకంటే ఇదివరకు శతమానం భవతి, మహానుభావుడు సినిమాలు కూడా పల్లెటూరు అంశాలను టచ్ చేసి హిట్టు అందుకున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి శర్వానంద్ ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.