Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణ‌తో మెగా ప్రొడ్యూస‌ర్ స‌ర్ప్రైజ్ డీల్‌

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:19 AM GMT
బాల‌కృష్ణ‌తో మెగా ప్రొడ్యూస‌ర్ స‌ర్ప్రైజ్ డీల్‌
X
ఒక స్టార్ హీరోతో సినిమాలు చేసే నిర్మాత‌లు మ‌రో స్టార్ హీరో కాంపౌండ్ లోకి అడుగుపెట్ట‌డం అన్న‌ది టాలీవుడ్ లో చాలా అరుదు. ఇది మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ ల హ‌యాం నుంచి కొన‌సాగుతూ వ‌స్తోంది. అయితే ఆ సంప్ర‌దాయానికి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఫుల్ స్టాప్ పెట్టేసి స‌రికొత్త ప్ర‌క్రియ‌కు నాంది ప‌లుకుతున్నారు. అల్లు అర‌వింద్ అత్య‌ధిక శాతం మెగాస్టార్ తో పాటు మెగా హీరోల చిత్రాల‌కు మాత్ర‌మే నిర్వాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇత‌ర హీరోల చిత్రాల‌కు పెద్ద‌గా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన దాఖ‌లాలు లేవు.

కేఊవ‌లం స‌మ‌ర్ప‌కులుగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రించారు. అయితే ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆయ‌న కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం ర‌స‌వ‌త్త‌ర పోటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంటే ఈ ఇద్ద‌రు వ్య‌క్తిగ‌తంగా మిత్ర‌లే అయినా వృత్తి ప‌రంగా రైవ‌ల్స్ అన్న‌మాట‌. అయితే మెగా క్యాంప్ లో కీల‌క వ్య‌క్త‌గా వుంటున్న అల్లు అర‌వింద్ ఇప్పుడు `ఆహా` కోసం నంద‌మూరి బాల‌కృష్ణ‌నే స్వ‌యంగా రంగంలోకి దింపి హోస్ట్ గా `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` పేరుతో టాక్ షోని స్టార్ట్ చేసి దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిపారు.

దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫైన‌ల్ ఎపిసోడ్ తో ఈ టాక్ షో ఎండ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 4న `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాల‌య్యని తొలి సారి హోస్ట్ గా ప‌రిచ‌యం చేసి `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` టాక్ షో తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన అల్లు అర‌వింద్ బాల‌య్య‌ని స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

`అన్ స్టాప‌బుల్ టాక్ షోతో స‌క్సెస్ ఫుల్ జోడీగా మారిన బాల‌య్య - అల్లు అర‌వింద్ త్వ‌ర‌లో ఓ భారీ సినిమాని చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గీతా ఆర్ట్స్ లో మెగా హీరోల‌ని మాత్ర‌మే ప్రొడ్యూస్ చేసిన అల్లు అర‌వింద్ తొలిసారిగా బాల‌య్య తో భారీ చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌లు పెట్టార‌ని చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని, బాల‌య్య‌ని ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో చూపించ‌బోయే ఈ మూవీ కోసం ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ ప‌లు ద‌ర్శ‌కుల‌తో చ‌ర్చిస్తున్నారని చెబుతున్నారు. బాల‌య్య‌కు స‌రిపోయే స్టోరీ, ఆయ‌న‌ని మ‌రింత కొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఫైన‌ల్ కాగానే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే మెగా ప్రొడ్యూస‌ర్ స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపిన‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.