Begin typing your search above and press return to search.

విశాఖపై కన్నేసిన మెగా హీరోలు

By:  Tupaki Desk   |   21 March 2017 4:23 PM IST
విశాఖపై కన్నేసిన మెగా హీరోలు
X
విశాఖ ఏరియా మెగా హీరోలకు కంచుకోటగా మారిపోతోంది. సహజంగా అయితే నైజా మార్కెట్ మెగా హీరోలకు చాలా ప్రధానమైనది. కానీ ఇప్పుడు మాత్రం వైజాగ్ ఏరియా నుంచి అందరు మెగా హీరోల సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.

అల్లు అర్జున్ సరైనోడు.. రామ్ చరణ్ ధృవ.. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150లకు ఉత్తరాంధ్ర ఏరియా నుంచి భారీగా వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాలకు అన్ని ఏరియాల నుంచి వసూళ్లు బాగున్నా.. విశాఖ నుంచి వచ్చిన మొత్తం చాలా ఎక్కువ. అందుకే ఇక్కడి మార్కెట్ ను మరింత పటిష్టం చేసుకునేందుకు మెగా హీరోలు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ విశాఖలోని ఓ కాలేజ్ ఉత్సవాలకు హాజరు కావడం కూడా గమనించచ్చు. ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండే మెగా పవర్ స్టార్.. విశాఖ ఏరియాలో ఫంక్షన్ కాబట్టే హాజరయ్యాడని చెప్పచ్చు.

సుకుమార్ తో తీయనున్న సినిమాకు ఆడియో ఫంక్షన్ ను వైజాగ్ లోనే జరుపుతానని చెప్పాడు చెర్రీ. సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఇక్కడే నిర్వహించాడు బన్నీ. మరోవైపు విశాఖలో స్టూడియో ఏర్పాటు చేసేందుకు చిరంజీవి.. అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. ఇక భీమిలీ పరిసరాల్లో తాను సెటిల్ అవుతానని గతంలో చిరంజీవి చెప్పారు కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/