Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేస్తున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:30 AM GMT
మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేస్తున్న మెగా హీరో
X
మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌హ్ తేజ్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేస్తున్నారు. గ‌త కొన్ని నెల‌ల క్రితం అంటే సెప్టెంబ‌ర్ 10న హైద‌రాబాద్‌లో ని గ‌చ్చిబౌలి ప్రాంతంలో త‌న స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ యాక్సిండెంట్ కు గురైన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆయ‌నని హుటా హుటిన మాధాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ట్రీట్ మెంట్ జ‌రిగాక మ‌ళ్లీ జూబ్లీ హిల్స్ లోని మ‌రో ప్రైవేట్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

యాక్సిడెంట్ కార‌ఫంగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కు ఆ త‌రువాత మైన‌ర్ స‌ర్జీరీ జ‌రిగింది. దాంతో ఆయ‌న కంప్లీట్ గా కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే న‌ట‌ని డాక్ట‌ర్లు సూచించ‌డంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త కొన్న నెల‌లుగా ఇంటి ప‌ట్టునే వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవ‌ల పూర్తిగా కోలుకున్న ఆయ‌న మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్ లో క‌నిపించారు కానీ మీడియా ముందుకు రాలేదు.

ఇటీవ‌ల కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌త్యేకంగా ఇంటికి వెళ్లి సాయి ధ‌ర‌మ్ తేజ్ ని ప‌రామ‌ర్శించ‌డంతో ఆయ‌న ఫొటో బ‌య‌టికి వ‌చ్చింది. పూర్తిగా కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ చాలా హెల్దీగా క‌నిపించారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌ని లైన్ లో పెట్టాలనుకుంటున్నార‌ట‌.`రిప‌బ్లిక్` త‌రువాత సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ థ్రిల్ల‌ర్ మూవీని చేస్తున్నారు. SDT15 గా రూపొందుతున్న ఈ మూవీకి కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ ని త్వ‌ర‌లో ప్రారంభించి సెట్ లో సంద‌డి చేయ‌డానికి సాయి ధ‌ర‌మ్ తేజ్ రెడీ అయిపోతున్నారు. బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సుకుమార్ వ‌న్ ఆఫ్ ది పార్ట్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూనే క‌థ అందించ‌డం విశేషం.