Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఈవెంట్ అతిధి గా మెగాస్టార్?

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:48 AM GMT
మ‌హేష్ ఈవెంట్ అతిధి గా మెగాస్టార్?
X
2020 సంక్రాంతి పందెం ప్ర‌ధానం గా బ‌న్ని-మ‌హేష్ మ‌ధ్య‌నే అంటూ ప్ర‌చారం హోరెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌రిలో నాలుగైదు చిత్రాలు ఉన్నా.. అల వైకుంఠ‌పుర‌ములో- స‌రిలేరు నీకెవ్వ‌రు మ‌ధ్య‌నే అస‌లు సిస‌లు పోటీ. అందుకు త‌గ్గ‌ట్టే ఆ రెండు చిత్రాల‌కు ప్ర‌చారం హోరెత్తుతోంది. బన్ని టీమ్.. మ‌హేష్ టీమ్ ప్ర‌మోష‌న్స్ ప‌రంగా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది.

జ‌న‌వ‌రి 11న స‌రిలేరు.. జ‌న‌వ‌రి 12న అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్టే ప్ర‌చారాన్ని ఇరు టీమ్ లు ప్లాన్ చేశాయి. ఇక ఇప్ప‌టికే మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీరిలీజ్ తేదీని లాక్ చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 5న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ వేదిక‌ కు ఒక మెగా హీరో ముఖ్య అతిధిగా ఎటెండ్ కానున్నార‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

సంక్రాంతి బ‌రిలో మెగా హీరో తో పోటీ ప‌డుతున్న మ‌హేష్ కి మెగా ఫ్యాన్స్ మ‌ద్ధ‌తు కూడా అవ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టే ఈ ప్లానింగ్ సాగుతుండ‌డం ఆస‌క్తిరేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే స‌రిలేరు టీమ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని సంప్ర‌దించార‌ట‌. అయితే చెర్రీకి ఈవెంట్ కి రావ‌డానికి వీలుప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. మెగా ఫ్యాన్స్ అటు బ‌న్ని సినిమాతో పాటు మ‌హేష్ సినిమాని స‌పోర్ట్ చేయాల్సి ఉంటుంద‌నే సంకేతాలు అందిన‌ట్టే. మొత్తానికి ప్ర‌చారంలో అనీల్ రావిపూడి బృందం వేసిన మాస్ట‌ర్ ప్లాన్ బావుందే! అంటూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారంతా.