Begin typing your search above and press return to search.

పిక్ టాక్: సెలబ్రేషన్స్ లో మునిగిపోయిన మెగా ఫ్యామిలీ..!

By:  Tupaki Desk   |   25 Dec 2020 10:52 AM GMT
పిక్ టాక్: సెలబ్రేషన్స్ లో మునిగిపోయిన మెగా ఫ్యామిలీ..!
X
మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇటీవల నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మరోసారి మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఉపాసన దంపతులు తమ ఇంట్లో హోస్ట్ చేసిన ఈ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారని తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అందరూ హాజరై సంబరాలు చేసుకున్నారు. క్రిష్మస్ సెలబ్రేషన్స్‌ కు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశాడు.

ఈ ఫోటోలలో చరణ్-ఉపాసన లతో పాటు అల్లు అర్జున్-స్నేహ.. నిహారిక-చైతన్య.. కళ్యాణ్ దేవ్-శ్రీజ.. విష్ణు ప్రసాద్-సుష్మిత.. వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ - అల్లు శిరీష్ - అల్లు బాబీ తదితరులు కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను అల్లు అర్జున్ - శిరీష్ కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క‌జిన్స్‌ తో సీక్రెట్ శాంటా ఆడామ‌ని.. అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చినందుకు చరణ్ - ఉపాసనకు ధన్యవాదాలు అని శిరీష్ ట్వీట్ చేశాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ‌ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని.. ఈ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేస్తూ క్రిస్మస్ ట్రీ తో దిగిన ఓ ఫోటో ని షేర్ చేశాడు.