Begin typing your search above and press return to search.

సుశాంత్ విషయంలో ఇండస్ట్రీ ఫెయిల్ అయింది: వివాదాస్పద హీరోయిన్

By:  Tupaki Desk   |   15 Jun 2020 10:50 AM GMT
సుశాంత్ విషయంలో ఇండస్ట్రీ ఫెయిల్ అయింది: వివాదాస్పద హీరోయిన్
X
హీరోయిన్ మీరా చోప్రా అంటే ప్రస్తుతం అయితే ఎవరికీ తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న ఈ బ్యూటీలలో ఈమె ముందు వరుసలో ఉంది. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన మీరా.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ తట్టుకోలేక సైబర్ టీమ్‌కు కంప్లయింట్ ఇచ్చింది. ఆ తర్వాత మంత్రి కెటిఆర్ భరోసా ఇవ్వడం గురించి తెలిసిందే. తాజాగా అమ్మడు మరోసారి కామెంట్స్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. నిన్న సూసైడ్ చేసుకుని ప్రాణాలు వదిలేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తాజాగా క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాసి పోస్ట్ చేసింది.

ఒక మనిషి చనిపోతే పెద్ద పెద్ద సందేశాలు రాస్తారు.. అతను బతికి ఉన్నప్పుడు ఎటువంటి ప్రేమ చూపించని ఇండస్ట్రీలో ఉన్నాం.. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ తరపున సుశాంత్‌కు క్షమాపణలు తెలుపుతున్నానంటూ మీరా లేఖలో తెలిపింది. అంతేగాక లేఖలో.. ‘‘మనందరం ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ బతుకుతున్నాం. ఇదొక బాధాకరమైన విషయం. ఎందుకంటే సుశాంత్ చాలా కాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతుంటే.. అతను కోసం మనం ఏం చేశాం? అతని క్లోజ్ సర్కిల్, దర్శకులు, నిర్మాతలు వీళ్లంతా ఏం చేశారు? ఎందుకని ఒక్కరూ కూడా ముందుకు వచ్చి అతని పై ప్రేమ చూపించలేదు. అతని విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు.

ఒక సినిమా ప్లాప్ అయితే చాలు.. ఈ ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు. బాలీవుడ్ అనేది చిన్న కుటుంబం.. నిజమే కానీ అవసరం అయినప్పుడు ఈ కుటుంబంలో దయ అనేది కనిపించదు. ఈ కుటుంబం కోసం అతను ఎంతో బాధను అనుభవించాడు. మనిషి బాధలో ఉన్నప్పుడు పలకరించరు కానీ, చనిపోయిన తర్వాత సుదీర్ఘ సందేశాలు ఇస్తుంటారు. దాని వల్ల ఉపయోగం ఏముంది. సుశాంత్.. నీ మృతితో నాకు సొంత వ్యక్తిని కోల్పోయిన భావన కలుగుతుంది. నీ విషయంలో అందరం ఫెయిల్ అయ్యాం. ఇండస్ట్రీ అంతా ఫెయిల్ అయింది. అందుకే ఇండస్ట్రీ తరుపున నీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను..’’ అంటూ మీరా చోప్రా కాస్త లోతుగానే లేఖలో పేర్కొంది. ప్రస్తుతం మీరా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.