Begin typing your search above and press return to search.

EMK బ్లాక్ బస్టర్ ప్రోమో: మహేష్ - తారక్ అల్లరి మామూలుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:57 AM GMT
EMK బ్లాక్ బస్టర్ ప్రోమో: మహేష్ - తారక్ అల్లరి మామూలుగా లేదుగా..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో కు సూపర్ స్టార్ మహేష్ సెలబ్రిటీ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. 'పూనకాల ఎపిసోడ్ లోడింగ్' అంటూ నిర్వాహకులు ఈ స్పెషల్ ఎపిసోడ్ మీద అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'వెల్ కమ్ మహేష్ అన్నా..' అంటూ మహేష్ ను ఎన్టీఆర్ ఆహ్వానిస్తే. 'నీకంటే మీ గురువు గారే బెటర్' అంటూ మహేష్ సందడి చేశారు.

అప్పటి నుంచి ఒకే ఫ్రేమ్ లో మహేష్ - తారక్ చేసిన అల్లరి కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఎపిసోడ్ ఆఫ్ ది డికేడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందనే విషయాలను జెమినీ టీవీ వెల్లడించింది. ఎల్లుండి డిసెంబర్ 5వ తేదీ ఆదివారం రాత్రి 8.30 నుండి ప్రసారం కాబోతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు.

15వ ప్రశ్న ఫస్ట్ అడిగేయమని మహేష్ సరదాగా అంటుండగా.. కోటి ఇచ్చేసి, తగ్గించుకుంటూ వెయ్యికి రమ్మంటారా అని ఎన్టీఆర్ నవ్వేశారు. ఈ క్రమంలో కోటి రూపాయలకు 15వ ప్రశ్న మీ కొత్త కంప్యూటర్ స్క్రీన్ మీద అని ఎన్టీఆర్ ఆట పట్టించారు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకున్న EMK లేటెస్ట్ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.

మహేష్ బాబు - ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్స్ కలిసి ఎంటర్టైన్ చేయబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు.. స్మాల్ స్క్రీన్ మీద మీద హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ గ్యారంటీ అని సినీ అభిమానులు భావిస్తున్నారు. రియల్ లైఫ్ లో ఎంతో సన్నిహితంగా ఉండే తారక్ - మహేష్.. ఈ గేమ్ షోలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకోబోతున్నారో తెలుసుకోవాలని అందరూ వేచి చూస్తున్నారు.

ఇకపోతే 'ఎవరు మీలో కోటీశ్వరులు' లో మహేష్ రూ. 25 లక్షలు గెలుపొందారని సమాచారం. ఆ మొత్తాన్ని సూపర్ స్టార్ ఓ ఛారిటీకి డొనేట్ చేశారని తెలుస్తోంది.