Begin typing your search above and press return to search.

#MB27 హిమాల‌యాల నుంచి దిగాకే

By:  Tupaki Desk   |   10 March 2020 5:11 AM GMT
#MB27 హిమాల‌యాల నుంచి దిగాకే
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బాక్సాఫీస్ వ‌సూళ్లు సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో అల వైకుంఠ‌పురములో క్లీన్ విన్న‌ర్ గా నిల‌వ‌గా.. స‌రిలేరు వ‌సూళ్ల ప‌రంగా నెగ్గుకొచ్చింది. ఈ రిజ‌ల్ట్ మ‌హేష్ లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. స‌క్సెస్ మీట్లు.. నైట్ పార్టీలు ముగిసిన త‌ర్వాత‌ కుటుంబంతో క‌లిసి విదేశీ ట్రిప్ కి వెళ్లారు. ప్ర‌స్తుతం మ‌హేష్‌ ఇంకా విరామంలోనే ఉన్నారు. దాదాపు రెండు నెల‌ల‌పాటు ఫ్యామిలీతోనే గ‌డిపేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఇక మ‌హేష్ కి అమెరికాలో శ‌స్త్ర చికిత్స అన్న లీకులు ఇంత‌కుముందు ఫ్యాన్స్ ని వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. అటు మ‌హేష్ 27వ సినిమా విష‌యంలో ఇటీవ‌లే కొంత క్లారిటీ వ‌చ్చింది. సందిగ్థ‌త తొల‌గి చివ‌రిగా వంశీ పైడిప‌ల్లి స్థానంలో `గీత‌గోవిందం` డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంని లైన్ లోకి తీసుకొచ్చారు.

దీంతో మ‌హేష్ 27 ఇక ప‌ట్టాలెక్క‌డ‌మే ఆల‌స్యం. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివ‌రాలేవి అధికారికం రివీల్ కాలేదింకా. స్క్రిప్ట్ స‌హా డైరెక్ట‌ర్ విష‌యాన్ని మహేష్ ఇంకా గోప్యంగానే ఉంచారు. తాజాగా ఎంబీ27కి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. మ‌హేష్ త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు ప‌య‌నం అవుతున్నారు. కొన్ని రోజుల పాటు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం లో ఆథ్యాత్మిక చింత‌న‌లోకి వెళ్ల‌బోతున్నారు. మ‌హేష్ శారీర‌కంగా ఫిట్ గా ఉన్నా మాన‌సిక ఒత్తిడిల నుంచి ఉప‌శ‌మ‌నం కోస‌మే ఈ ట్రిప్ ని ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

స‌రిలేరు షూటింగ్ లో భాగంగా మ‌హేష్‌ ఎక్కువ రోజులే కాల్షీట్లు కేటాయించారు. కేవ‌లం 63 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి..సంక్రాంతికి రిలీజ్ చేసారు.. అయితే ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఒత్తిడికి గురైన‌ట్లు ప‌లు ఇంట‌ర్వూల్లో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ ట్రిప్ ఎన్ని రోజుల‌న్న‌ది తెలియ‌దు గానీ...మ‌హేష్ హిమాల‌యాల నుంచి హైద‌రాబాద్ కి తిరిగి రాగానే ప‌ర‌శురాం ప్రాజెక్ట్ నే ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. అలాగే ఈ సినిమా క‌థాంశం ఒక‌ బ్యాంక్ స్కామ్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తాజాగా లీకులందాయి.