Begin typing your search above and press return to search.

సాహో అనిపించే ఇంటర్వెల్ బ్లాక్..!

By:  Tupaki Desk   |   8 March 2019 10:02 AM GMT
సాహో అనిపించే ఇంటర్వెల్ బ్లాక్..!
X
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' పై ఇప్పటికే ఉన్న అంచనాలను హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' మరింతగా పెంచేసింది. ఈ సినిమాపై క్రేజ్ ఎలా ఉందనేదానికి మనకు ఉదాహరణ భారీధరకు అమ్ముడైన 'సాహో' ఓవర్సీస్ రైట్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ షాక్ కు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ నిపుణుల సహకారంతో దుబాయ్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ అంతా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగంది. నిజానికి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 లో ఆ మేకింగ్ వీడియో చూసే అందరూ థ్రిల్లయ్యారు. ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ కూడా దాదాపు అలాంటిదే ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ పర్యవేక్షణకు కేన్నీ బేట్స్ హైదరాబాద్ వస్తున్నారట.

ఈ ఇంటర్వెల్ బ్లాక్ కు సంబందించిన షెడ్యూల్ కోసం నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఒక ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఈ రేంజ్ లో ఖర్చుపెట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాలు ఈ బడ్జెట్ తో తెరకెక్కుతాయి. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో 'సాహో' ముఖ్యతారాగణం అంతా పాల్గొంటుందట. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'సాహో' ను ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.