Begin typing your search above and press return to search.

మాస్‌ పవన్ ఫ్యాన్స్‌ కు రేపు పండగే

By:  Tupaki Desk   |   6 Nov 2021 1:30 PM GMT
మాస్‌ పవన్ ఫ్యాన్స్‌ కు రేపు పండగే
X
పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి చిన్న అప్‌డేట్‌ వచ్చినా కూడా రచ్చ రంబోళ అన్నట్లుగా అభిమానులు సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తున్నారు. పవన్ అభిమానుల్లో ఎక్కువ శాతం మంది మాస్ ఆడియన్స్ ఉంటారు. అలాంటి మాస్ వాళ్లకు పండుగ రేపు. ఔను థమన్‌ సంగీతం అందించిన భీమ్లా నాయక్‌ సినిమాలోని లాల భీమ్లా పాట విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల అయిన పాట గ్లిమ్స్ అభిమానులకు పూనకాలు తెచ్చింది అనడంలో సందేహం లేదు. వెంట్రుకలు నిక్కపొడ్చుకునే విధంగా రచ్చ రచ్చగా లాల భీమ్లా మాస్ బీట్స్ తో ఉంటుందని థమన్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. పవన్‌ తో మళ్లీ మళ్లీ ఆఫర్‌ కోసం థమన్‌ ప్రాణం పెట్టి మరీ పాటలు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. రేపు ఈ పాట పూర్తిగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ అయితే ఏంటీ.. టీజర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరియు పాటలు ఇలా ప్రతి ఒక్కటి కూడా పవన్ భీమ్లా నాయక్‌ రేంజ్ ను పెంచే విధంగా అదరగొట్టాడు థమన్‌. అందుకే ఈ పాట పై ఆకాశమే హద్దు అన్నట్లుగా పవన్‌ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా రేపు మాస్‌ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా అందరికి కూడా పండుగ వంటి పాట రాబోతుందని.. వారం పది రోజులు ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ పాట తప్ప మరే పాట వినిపించనంత రచ్చ చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ ను కూడా ఆ పాట దక్కించుకుంటుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా లోని ఆ పాటలో పవన్‌ విజువల్స్ కూడా అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటాయట.

మలయాళ సూపర్‌ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్‌ అన్నట్లుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. సంక్రాంతికి సినిమా అన్నారు. అయితే ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల ఉండటం వల్ల వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా భీమ్లా నాయక్‌ నిలువబోతుందనే నమ్మకంతో అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ హీరోయిన్ గా పవన్ కు జోడీగా నటిస్తోంది. రానా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కు రచన సహకారంను త్రివిక్రమ్‌ అందిస్తున్నాడు. సితార ఎంటర్‌ టైన్ మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు.