Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో పిల్లలతో లాక్ అయిన మాస్ హీరో...!

By:  Tupaki Desk   |   12 April 2020 4:05 PM GMT
లాక్ డౌన్ లో పిల్లలతో లాక్ అయిన మాస్ హీరో...!
X
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సెలెబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ తో క్యాలెండర్ మొత్తం ఫుల్ బిజీగా ఉండే సినీ స్టార్స్ అంతా ఇలా కొన్ని వారాల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే టైం స్పెండ్ చేయడంతో వారి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే జిమ్‌లో కూడా వర్క్‌ అవుట్స్ కూడా చేస్తున్నారు‌. ఇంటివద్దే ఉండండి.. ఫిట్‌గా ఉండండనే సందేశాన్ని కూడా ఇస్తున్నాడు.

అయితే రవితేజ తన పర్సనల్ విషయాలు ఎక్కువగా ఎక్కడా షేర్ చేసుకోరు. తన ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కడా బయటపెట్టరు. కానీ ఆయన సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడు షేర్‌ చేస్తున్నారు. పిల్లలో కలిసి రవితేజ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మాస్ మహారాజ్ మొత్తానికి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ వేళ ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు రవితేజ తనవంతు సాయంగా కరోనా క్రైసిస్‌ ఛారిటీ 'మనకోసం'కు రవితేజ రూ. 20 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలే నెలకొనియున్నాయి.