Begin typing your search above and press return to search.

కొత్త దంప‌తులు పెళ్లిఖ‌ర్చంతా ఓటీటీపైనే వేసారా?

By:  Tupaki Desk   |   17 Jun 2022 12:30 PM GMT
కొత్త దంప‌తులు పెళ్లిఖ‌ర్చంతా ఓటీటీపైనే వేసారా?
X
పెళ్లి ఖ‌ర్చులంటే సాధార‌నంగా అబ్బాయి త‌రుపువారో..అమ్మాయి త‌రుపువారో ఖ‌ర్చు చేస్తారు. లేదంటే రెండు వైపుల వారు స‌రి స‌మానంగా వెచ్చిస్తారు. ముఖ్యంగా వివాహ క్ర‌తువు సంద‌ర్భంలో క‌చ్చితంగా క‌ష్టార్జిత‌మే పెట్టాల‌న్న‌ది ఓ సంప్ర‌దాయంగా ఎప్ప‌టి నుంచో వ‌స్తోన్న హిందూ ఆచారం కూడా. ఎవ‌రి స్తోమ‌త‌కు త‌గ్గ‌ట్లు వారి క‌నుకనుగుంణంగా ఖ‌ర్చు జ‌రుగుతుంది.

అయితే న‌య‌న‌తార‌- విగ్నేష్ శివ‌న్ పెళ్లి తంతు మాత్రం ఇందుకు పూర్తి భిన్న‌మ‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తుంది. జూన్ 9న ఇద్ద‌రి విహం మ‌హాబ‌లి పురం రిసార్ట్ లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రిస్టార్ట్ డెక‌రేష‌న్ మొద‌లుకుని క‌ళ్యాణం మండ‌పం సెట‌ప్..లైటింగ్..భోజ‌నాలు వ‌గైరా మొత్తం క‌లుపుకుని దాదాపు 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు జ‌రిగింద‌ని అంచ‌నా.

ఈ 25 కోట్ల రూపాయ‌ల్లో ఒక్క రూపాయి కూడా న‌య‌న‌తార ప‌ర‌స నుంచి గానీ...విగ్నేష్ శివ‌న్ జేబులోని నుంచి కానీ తీయ‌లేద‌ట‌. ఆ ఖ‌ర్చు అంతా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ప్లిక్స్ సంస్థ‌నే పెట్టుకుందిట‌. ఈ జంట‌ కేవ‌లం పెళ్లి వస్ర్తాల‌కు అయిన ఖర్చు త‌ప్ప‌..అద‌నంగా ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేదంట‌. ఈ వివాహ వేడుక‌కు సంబంధించిన క‌వ‌రేజ్ మొత్తం నెట్ ప్లిక్స్ కి విక్రంయించ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలుస్తుంది.

పెళ్లి కోసం ఏర్పాటు చేసిన మ్యాక‌ప్ ఆర్టిస్లు ద‌గ్గ‌ర నుంచి సెక్యురిటీ సిబ్బంది వ‌ర‌కూ ముంబై నుంచి ప్ర‌త్యేకంగ‌తా ర‌ప్పించి వివాహ క్ర‌త‌వును ద‌గ్గ‌రుండి నెట్ ప్లిక్స్ నిర్వ‌హించిందిట‌. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ డీల్ చేసారుట‌. నెట్ ప్లిక్స్ తో డీల్ మాట్లాడ‌టం..క‌వ‌రేజ్ లో భాగంగా న‌య‌న్-విగ్నేష్ దంప‌తుల‌కు నెట్ ప్లిక్స్ నుంచి వెళ్లాల్సిన కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వ్య‌వ‌హ‌ర‌మంతా గౌత‌మ్ డీల్ చేసారుట‌.

మ‌రి పెళ్లికి అయిన ఖ‌ర్చు మొత్తం కవ‌రేజ్ లో భాగంగా రికవ‌రీ చేసుకుంటుందా? లేక అది అద‌న‌మా? అన్న‌ది తెలియ‌దు గానీ దాదాపు 100 కోట్ల‌తో ఒప్పందం జ‌రిగింద‌ని తెలుస్తుంది. పెళ్లికి సంబంధించిన‌ ఫోటోలు..వీడియోలు త్వ‌ర‌లోనే అధికారికంగా నెట్ ప్లిక్స్ ద్వారా ప్ర‌సారం చేసే అవకాశం ఉంది. ఇది నిజ‌మ‌యంగా సెల‌బ్రిట‌లీ పెళ్లిలో స‌రికొత్త సంస్కృతిగానే భావించాలి.

సాధార‌ణంగా సెల‌బ్రిటీ వివాహ‌మంటే వీడియో పుటేజ్ మాత్రం ఓటీటీకు అమ్ముకుంటారు. దాని క‌వ‌రేజ్ బాధ్య‌త‌లు మొత్తం స‌ద‌రు ఓటీటీనే ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది. కానీ న‌య‌న్-విగ్నేష్ పెళ్లి తంతు మాత్రం పుటేజ్ తో పాటు...పెళ్లికి అయిన ఖ‌ర్చులు కూడా స‌ద‌రు ఓటీటీ భ‌రించ‌డం అంటే? విచిత్రంగానే అనిపిస్తుంది.

ఇటీవ‌లే క‌త్రినాకైఫ్‌-విక్కీ కౌశ‌ల్ వివాహం జ‌రిగింది. ఆ పెళ్లి పుటేజీని ఓ ప్ర‌ముఖ ఓటీటీకి 100 కోట్ల‌కు విక్ర‌యించారు ఆ దంప‌తులు. ఈనేప‌థ్యంలో పెళ్లి వీడియోని అమ్ముకోవ‌డం ఏంట‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.