Begin typing your search above and press return to search.

మిస్సిండియా ముందు అంతా తేలిపోయారుగా

By:  Tupaki Desk   |   10 May 2018 10:58 AM GMT
మిస్సిండియా ముందు అంతా తేలిపోయారుగా
X
బాలీవుడ్లో వీర ఫాలోయింగ్ హీరోయిన్లు ఎవ‌రంటే క‌చ్చితంగా ప్రియాంక చోప్రా దీపికా ప‌దుకునే క‌త్రినా కైఫ్ దిశా ప‌టానీ లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. అలాంటి వారినే తొక్కేసింది ఈ హ‌ర్యానా బ్యూటీ మానుషి చిల్ల‌ర్‌. గ‌తేడాది మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నాక మిస్ వ‌ర‌ల్డ్ గా మెరిసి దేశంలో కోట్ల మందిని అభిమానులుగా మార్చుకుంది. అందుకే ఇప్పుడామే టాప్ బాలీవుడ్ బ్యూటీస్ ని కాద‌ని మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017గా నిలిచింది.

దీపిక ప‌దుకునే ఎన్ని సినిమాలు చేసిందో... ఎంత‌గా అభిమానుల‌కు ఆక‌ట్టుకుందో తెలుసు. ప్రియాంక ఏమ‌న్నా త‌క్కువా? గ్లోబ‌ల్ స్టార్ గా అవ‌త‌రించింది. అలాంటివారిని కాద‌ని మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ అవార్డుకు మానుషి ఎలా ఎంపికైంది. ఇంకా ఒక్క సినిమాలో కూడా బుక్ అవ్వ‌లేదు. యాడ్స్‌లోనూ క‌నిపించ‌డం లేదు. అయినా ఇంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వ‌చ్చేసింది మానుషికి? సోష‌ల్ మీడియా ఉందిగా. హాట్ లుక్స్‌తో ఆమె పోస్టు చేసే ఫోటోలు ఎంతోమందికి చేరువ‌య్యాయి. సినిమా హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌న‌ట్టుగా ఎక్స్ పోజింగ్ లోనూ ముందుంటోంది పిల్లా. బికినీలో హాట్ ఫోజుల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొట్టింది. ఆ ఫోటోలే ఆమెను యూత్‌కు బాగా చేరువ‌చేశాయి.

టైమ్స్ ఏటా నిర్వ‌హించే మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017లో యూత్ అంతా మానుషికే ఓట్లేసి మొద‌టి స్థానంలో నిల‌బెట్టారు. రెండో స్థానంలో దీపికా ప‌దుకునే మూడో స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నాలుగో స్థానంలో క‌త్రినా కైఫ్ నిలిచారు. బాలీవుడ్ ఊపేసిన బ్యూటీల‌ను కూడా తొక్కేసింది మానుషి. ప్ర‌స్తుతం సేవా కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. వ‌చ్చే ఏడాది బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. మానుషి వ‌చ్చాక ఎంత బ్యూటీలు ఆమెను త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రో మ‌రి.