Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మెస్మరైజ్ చేస్తున్న మిస్ ఇండియా

By:  Tupaki Desk   |   1 May 2019 6:59 AM GMT
ఫోటో స్టొరీ: మెస్మరైజ్ చేస్తున్న మిస్ ఇండియా
X
మానుషి చిల్లర్ ఎవరో ఏంటో తెలియకపోయినా పేరు మాత్రం వినే ఉంటారు లెండి. ఎందుకంటే ఈ మానుషి 2017 లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న భామ. 2018 లో టైమ్స్ వారి మోస్ట్ డిజైరబుల్ వుమన్ అవార్డు కూడా సాధించింది. హర్యానాకు చెందిన ఈ భామ జస్ట్ అందగత్తె మాత్రమే కాదు. కూచిపూడి డ్యాన్సర్ కూడా. చదువులలో కూడా మానుషి దిట్ట. సీబీఎస్ఈ 12 క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఆల్ ఇండియా టాపర్. మానుషి ఫేమస్ 'నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా' లో కూడా ట్రైనింగ్ తీసుకుంది.

ఈ టాలెంట్ అంతా రేపు సినిమాలలో అవకాశం వస్తే చూపించడం ఖాయమే కానీ అంతలోపు సోషల్ మీడియాలో హీట్ పెంచే కార్యక్రమం చేపట్టింది. అసలే హాట్ షాట్ మోడల్ కావడం తో గ్లామర్ కు.. స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ కు కేరాఫ్ ఆడ్రెస్ లాగా ఉంటుంది. మరి ఇలాంటి భామ ఫోటో షూట్స్ చేస్తే అవి నెటిజనులను మెప్పించకుండా ఎలా ఉంటాయి? తాజాగా మానుషి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కు "ఈ అద్భుతమైన ప్రపంచంలో నన్ను నేను మిస్సయ్యాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఫోటోలో మానుషి ఎలా ఉందంటే ఒక అల్ట్రా స్టైలిష్ మోడల్ తరహాలోనే ఉంది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్లో ఒంటి మీద ఆభరణాలు అసలు లేకుండా సింపుల్ గా ఫ్లోర్ పై కూర్చుంది. స్టైలింగ్ చేసిన హెయిర్ తప్ప.. ఈ ఫోటోలో ఎంత సహజంగా ఉండాలో అంత సహజంగా కనిపిస్తోంది. మేకప్పు ఫుల్ గా వేసుకొని.. ఆభరణాలు తగిలించి అందం ఇనుమండింపచేసుకోవడం ఆమెకు తెలియంది కాదు. అయినా ఇలా సింపుల్ గా ఫోటో షూట్ లో పాల్గోనడం గొప్ప విషయం. ఈ ఫోటో నెటిజనులకు నచ్చినట్టే ఉంది. ఎందుకంటే పోస్ట్ చేసిన 10 గంటలలోపే 2 లక్షల లైక్స్ వచ్చాయి. ఒక నెటిజన్ ఈ ఫోటోకు తాప్సీ పన్ను+దిశా పతాని అని కామెంట్ చేశాడు. ఆ ఇద్దరినీ కలిపితే వచ్చే అందం మానుషిలో ఆ మనిషికి ఏం కనిపించిందో!