Begin typing your search above and press return to search.

హరికృష్ణ మరణం..మీడియాకు మనోజ్ విన్నపం

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:47 PM IST
హరికృష్ణ మరణం..మీడియాకు మనోజ్ విన్నపం
X
హరికృష్ణ.. సినీ - రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఇప్పడాయన అకాల మరణం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్త అందరినీ కలిచివేస్తోంది. అందుకే సినీ ప్రముఖులంతా తాజాగా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ కూడా ఉద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో మీడియాకు ఒక విన్పపాన్ని చేశాడు. హరికృష్ణ గారి మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని.. ఆయన రోడ్డు ప్రమాద దృశ్యాలను మాటిమాటికి ప్రసారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలా ప్రసారం చేయడం వల్ల ఇప్పటికే బాధలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు - అనుచరులు - అభిమానులు మరింత కృంగిపోతున్నారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. హరికృష్ణకు తగిన గౌరవాన్ని ఇవ్వాలంటే మీడియాలో ప్రమాద దృశ్యాలు ప్రసారం చేయవద్దని.. తన ఈ వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నట్లు మనోజ్ ట్వీట్ చేశాడు.