Begin typing your search above and press return to search.

మంచు వారి మంచి మనసుకు మరో నిదర్శణం

By:  Tupaki Desk   |   20 May 2020 6:15 AM GMT
మంచు వారి మంచి మనసుకు మరో నిదర్శణం
X
ఈ విపత్తు సమయంలో మంచు ఫ్యామిలీ పేదలకు అందిస్తున్న సాయం ఇంకా వారు వ్యవహరిస్తున్న తీరు సోషల్‌ మీడియాలో ప్రశంసలు పొందుతోంది. కొన్ని రోజుల క్రితం మంచు మోహన్‌ బాబు ఆయన తనయుడు విష్ణు లు ఈ సమయంలో పోరాటం చేస్తున్న డాక్టర్లు మరియు పారిశుద్య కార్మికులకు సెల్యూట్‌ చేసిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో వీరిద్దరి పోస్ట్‌ లు వైరల్‌ అయ్యాయి.

మంచు మనోజ్‌ మరోసారి ఈ విపత్తు సమయంలో తన మంచితనంను చాటుకున్నాడు. వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు చూడలేక.. మీడియాలో వస్తున్న కథనాలకు చలించి పోయిన మంచు మనోజ్‌ వారిని స్వస్థలాలకు పంపించేందుకు బస్సులను ఏర్పాటు చేయించాడు. స్వయంగా తన ఖర్చుతో వారికి ఆహారం సరఫరా చేయించడంతో పాటు బస్సులను పెట్టించాడు. సోనూ సూద్‌ ను ఆదర్శంగా తీసుకుని మంచు మనోజ్‌ ఈ పని చేశాడు.

రోడ్ల మీద చిన్న పిల్లలు ముసలి వారు కొన్ని లక్షల మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పోతూ కనిపిస్తున్నారు. వారందరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కాలి నడకన వెళ్తున్నారు. వారిలో చాలా మంది మృత్యువాత పడుతుండగా కొందరు మాత్రం తీవ్ర అనారోగ్యంతో ఏదోలా ఇంటికి చేరుతున్నారు. ఇలాంటి సమయంలో మంచు మనోజ్‌ వంటి దాతలు ముందుకు వచ్చి తమవంతు సాయంను చేస్తున్నారు.