Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ విలన్..?

By:  Tupaki Desk   |   18 Aug 2021 8:30 AM GMT
రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ విలన్..?
X
అగ్ర దర్శకుడు శంకర్ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది చెర్రీ కెరీర్ లో 15వ సినిమా. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్‌ రాజు - శిరీష్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రధాన నటీనటులు - సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో నటీనటుల ఎంపిక కూడా అదే స్థాయిలో ఉంటోంది. 'RC15' చిత్రంలో రామ్ చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ 15వ చిత్రంలో బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు విలన్ రోల్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం మలయాళ నేచురల్ స్టార్ ఫహ‌ద్ ఫాజిల్ ని మేకర్స్ సంప్రదిస్తున్నారని అంటున్నారు.

ఫహద్‌ ఫాజిల్‌ 'ట్రాన్స్' 'అనుకోని అతిథి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రంతో టాలీవుడ్‌ లో ఎంటర్ అవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమాలో ఫహాద్‌ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు శంకర్ - చరణ్ చిత్రంలో ఫాజిల్ నటించడం ఖాయమేనని టాక్ వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే 'RC15' లో రామ్ చరణ్ కు ధీటుగా ఫాజిల్ రోల్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శంకర్ తన సినిమాల్లో విలన్ క్యారెక్ట‌రైజేష‌న్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తుంటారు. అందులోనూ ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే విలక్షణ నటుడు ఇందులో పొలిటిక‌ల్ లీడ‌ర్ గా క‌నిపించే ఛాన్స్ ఉంది. ఫహాద్ ఫాజిల్ డేట్స్ అడ్జ‌స్ట్ చేసిన వెంటనే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని టాక్.

'శంకర్ - చరణ్' చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ మూవీకి డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నాడు. ఇది దిల్ రాజు బ్యానర్ లో వచ్చే 50వ సినిమా. అంతేకాదు భారీ బడ్జెట్ తో రూపొందే మూవీ. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ కావడంతో.. RC15 పై సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సెప్టెంబర్ 8 నుంచి చరణ్ - శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ కాల్షీట్స్ కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' ఫైనల్ సాంగ్ షూట్ లో పాల్గొంటున్న చెర్రీ.. ఆగస్టు మూడో వారంలో ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. వెంటనే 'ఆచార్య' లో పెండింగ్ సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే 'RC 15' షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని షూట్ చేస్తారని టాక్ ఉంది. ఏదేమైనా వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ సినిమాని కంప్లీట్ చేయాలని శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.