Begin typing your search above and press return to search.

రైల్లో మ‌ల‌యాళ న‌టిపై అత్యాచార‌ వేధింపులు!

By:  Tupaki Desk   |   2 Feb 2018 7:33 AM GMT
రైల్లో మ‌ల‌యాళ న‌టిపై అత్యాచార‌ వేధింపులు!
X
ప్ర‌స్తుతం సమాజంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు - సినీ తారల‌కు కూడా లైంగిక వేధింపులు త‌ప్ప‌డం లేదు. హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వ‌ర‌కు సినీతార‌లు కొంద‌రు త‌మ రంగంతోపాటు బ‌య‌ట కూడా ఈ వేధింపుల బాధితులు కావ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. రెండు రోజుల క్రితం కోలీవుడ్ హీరోయిన్ అమ‌లాపాల్....ను చెన్నైలోని పాండిబ‌జార్ కు చెందిన అల‌గేశ‌న్ అనే వ్యాపారి లైంగికంగా వేధించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. మాట‌ల‌తో - చేత‌ల‌తో త‌న‌ను అల‌గేశ‌న్ వేధించాడంలూ అమ‌లాపాల్ ఇచ్చిన‌ ఫిర్యాదు ప్ర‌కారం అత‌డిని పోలీసులు అరెస్టు చేశారు. త‌న లాంటి వారికే ర‌క్ష‌ణ లేకుంటే ....ఇక సాధార‌ణ మ‌హిళ‌ల ప‌రిస్థితేమిటంటూ....అమ‌లాపాల్ ఆవేద‌న కూడా వ్య‌క్తం చేసింది.

ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తాజాగా - మ‌రో న‌టిపై లైంగిక వేధింపుల వార్త క‌ల‌క‌లం రేపుతోంది. మ‌ల‌యా నటి సనూషా...రైల్లో ప్ర‌యాణిస్తుండ‌గా ఓ కామాంధుడు ఆమెపై అత్యాచార వేధింపులకు పాల్ప‌డ్డాడ‌ని ఆమె తెలిపింది. తాను నిద్ర పోతున్న స‌మ‌యంలో త‌మిళ‌నాడుకు చెందిన ఆంటోబోస్ అనే వ్య‌క్తి ....త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆమె ఆరోపించింది. ఇదే విష‌యాన్ని టీటీఈకి తెలియ‌జేయ‌డంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి కున్నూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌నూష‌....తమిళంలో రేణిగుంట - భీమ - శశికుమార్‌ చిత్రం కొడివీరన్ లో నటించింది. భ‌విష్య‌త్తులో మ‌రెవ‌రూ ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌కుండా నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధించాల‌ని ప‌లురురు డిమాండ్ చేస్తున్నారు.