Begin typing your search above and press return to search.

400 మందిలో 17 వయసు పిల్ల తగిలింది

By:  Tupaki Desk   |   14 April 2015 11:16 AM GMT
400 మందిలో 17 వయసు పిల్ల తగిలింది
X
టాలీవుడ్‌లో కథానాయికగా అవకాశం పట్టేయడం అంటే అంత వీజీ కాదు. చాలా అర్హతలే ఉండాలి. అందానికి అందం, అందుకు తగ్గట్టే ప్రతిభ ఉంటేనే అవకాశం. ఆ కోవలో ఇటీవలి కాలంలో నవతరం బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నారు. అందం, ప్రతిభతో ఆకుట్టుకుంటున్నారు. రెజీన, రకూల్‌ప్రీత్‌లతో మొదలై రాశిఖన్నా, త్రిధా చౌదరి వరకూ ఇలా అన్నిటా నెగ్గుకొచ్చినవారే.

ఇప్పుడు అదే కోవలో మరో అందగత్తె టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఢిల్లీ అమ్మాయి మాళవిక నాయిర్‌ అనూహ్యంగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వెలిగిపోతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ రేసులోకి దూసుకొస్తోంది. ఈ అమ్మడు నాని సరసన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నాయికగా నటించింది. ఆ సినిమాలో చక్కని నటప్రతిభతో ఆకట్టుకుంది. ఆ సినిమా ఆడియో వేడుకలోనే దర్శకురాలు నందినిరెడ్డి తనని చూసి పడిపోయింది. అంతేకాదు వెంటనే తన సినిమాలో అవకాశం ఇచ్చింది. నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా అవకాశం అందుకుంది. ఈ యవ్వారం వెనుక పెద్ద ప్రాసెస్సే ఉంది.

ఈ సినిమాలో నాయిక కోసం దాదాపు 400 కొత్త ముఖాల్ని పరిశీలించింటద నందినీ రెడ్డి. చివరికి మాళవికనే తన నాయికగా ఫిక్సయిపోయానని చెబుతోంది. తన కళ్లు, ముక్కు, ప్రతిభ అస్సెట్స్‌ అంటోంది. బాగానే ఉంది. అసలు కంటెంట్‌ మీద ఏదైనా ఫోకస్‌ ఉందా లేకపోతే ఇలా యాక్టర్ల సెలక్షన్స్‌కే టైమ్‌ సరిపోతుందా...