Begin typing your search above and press return to search.

తెరమీదకు మరో లెజెండరీ బయోపిక్.. రానుందా?

By:  Tupaki Desk   |   11 March 2021 3:30 AM GMT
తెరమీదకు మరో లెజెండరీ బయోపిక్.. రానుందా?
X
గత కొన్నేళ్లుగా ఇండియన్ చిత్రపరిశ్రమలో బయోపిక్‌లు తెరకెక్కి మంచి హిట్స్ అందుకుంటున్నాయి. కాకపోతే ఈ బయోపిక్ ట్రెండ్ ఇప్పటిదే కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో కొనసాగుతుంది. ఇదివరకు బయోపిక్ లలో క్రీడా నేపథ్యమున్న సినిమాలు చాలానే వచ్చాయి. అందులో క్రికెటర్స్ ‘అజారుద్దున్’, ‘ఎంఎస్ ధోని’, ‘సచిన్’ సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం దేశానికి క్రికెట్‌లో వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా.. ‘83’ మూవీ రాబోతుంది. అంతేగాక వెండితెరపై విమెన్స్ వరల్డ్ క్రికెట్‌లో సత్తా చాటిన మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మొదలైంది. 2018లో సావిత్రి లైఫ్ స్టోరీతో మహానటి అనే సినిమా బయోపిక్ ట్రెండ్ స్టార్ట్ చేసింది.

అలాగే ఆ మధ్య సీనియర్ నందమూరి తారకరామారావు బయోపిక్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇప్పుడు మరో లెజెండరి యాక్ట్రెస్ బయోపిక్ తెరమీదకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అలనాటి సావిత్రి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలిగిన జమున జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట దేవినేని మూవీ ఫేమ్ డైరెక్టర్ నర్రా శివనాగు. ఇప్పటికే జమున బయోపిక్ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడట. జమున లైఫ్ స్టోరీకి సంబంధించి ఆమెనే స్వయంగా విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడట. అయితే జమున చక్కటి నటనతో పాటు మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే. ఆ పాత్రకోసం డైరెక్టర్ మిల్కీబ్యూటీ తమన్నాను పరిశీలిస్తున్నట్లు టాక్. ఎందుకంటే ఇప్పటికే తమన్నా తనలోని యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకుంది. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.