Begin typing your search above and press return to search.

అక్కినేని కపుల్ కాంబో ఆఫర్

By:  Tupaki Desk   |   24 Dec 2018 8:00 AM GMT
అక్కినేని కపుల్ కాంబో ఆఫర్
X
టాలీవుడ్ క్యుట్ కపుల్ గా పేరొందిన నాగ చైతన్య సమంతాల జంట పెళ్ళయ్యాక మొదటిసారి కలిసి నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్ను కోరి రూపంలో మంచి సక్సెస్ తో కెరీర్ ప్రారంభించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి మజిలి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చైతు సామ్ లు మనం తర్వాత కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకోలేదు. ఆ రకంగానూ దీన్ని చాలా స్పెషల్ మూవీగా ఫీలవుతున్నారు అభిమానులు. ఇదలా ఉండగా ఇందులో వీళ్ళకు రెమ్యునరేషన్లు ఎంత ఇచ్చి ఉండొచ్చు అనే సందేహం రావడం సహజం.

విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మాత సాహు గారపాటి కాంబో ఆఫర్ లో ఇద్దరికీ కలిపి 6 కోట్ల 60 లక్షల జాయింట్ రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇచ్చారని తెలిసింది. అయితే ఇది అధికారికంగా ప్రకటించి చెప్పుకునే విషయం కాదు కాబట్టి అనధికార వర్గాల మేరకు నిజమే అయ్యుండొచ్చని టాక్. చైతు సామ్ ఇద్దరు విడివిడిగా ఎంత పుచ్చుకునే వారో కాని మొత్తానికి ఈ సారి మాత్రం మంచి మొత్తాన్నే పట్టారు. సినిమా సేల్ అయ్యేదే ఈ ఇద్దరినీ చూసి కాబట్టి ఆ మాత్రం ఆఫర్ చేయడం సబబే.

చైతు సక్సెస్ కోసం బాగా మొహం వాచిపోయి ఉన్నాడు. గత ఏడాది యుద్ధం శరణంతో కలుపుకుని ఈ సంవత్సరం వచ్చిన శైలజారెడ్డి అల్లుడు-సవ్యసాచిలతో హ్యాట్రిక్ పూర్తయ్యింది. అచ్చి రాని జానర్లు టచ్ చేయడం వల్లే దెబ్బ పడిందని గుర్తించిన చైతు మళ్ళి లవ్ ట్రాక్లోకి వచ్చేసాడు. ఇది భార్యభర్తల కథే అయినప్పటికీ అదిరిపోయే లవ్ స్టొరీ ఉంటుందట. వైజాగ్ పరిసరాల్లో అధిక శాతం షూటింగ్ జరుపుకున్న మజిలి వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.