Begin typing your search above and press return to search.

వారెవ్వా మ‌హేష్ డ్యూయ‌ల్ ప్లాన్ వ‌ర్క‌వుటైందిగా

By:  Tupaki Desk   |   21 Jan 2021 3:30 PM GMT
వారెవ్వా మ‌హేష్ డ్యూయ‌ల్ ప్లాన్ వ‌ర్క‌వుటైందిగా
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ స‌డెన్ గా దుబాయ్ ట్రిప్ నుంచి ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి అభిమానుల్లో వైర‌ల్ అయిపోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ ఎప్ప‌టిలాగే ఈసారి కూడా త‌న షూటింగుల షెడ్యూల్ ని వెకేష‌న్ షెడ్యూల్ ని రెండిటినీ ప‌క్కాగా బ్యాలెన్సింగ్ గా ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇంత‌కుముందే మ‌హేష్ తో పాటు దుబాయ్ వెకేష‌న్ కి న‌మ్ర‌త‌.. గౌత‌మ్ సితార బృందంతో క‌లిసి వెళ్లార‌ని ఫోటోల్ని బ‌ట్టి అర్థ‌మైంది. ఈలోగానే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం రివీలైంది. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కార్ వారి పాట షెడ్యూల్ ని దుబాయ్ లోనే ప్రారంభిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఇలా డ్యూయ‌ల్ ప్లాన్ వ‌ర్క‌వుటైంద‌ని తెలుస్తోంది.

ఫ్యామిలీ లైఫ్.. ప్రొఫెష‌న‌ల్ లైఫ్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ మ‌హేష్ చేసిన ప్లాన్ ఇది. ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రో బంప‌ర్ హిట్ కొట్టాల‌న్న పంతంతో మ‌హేష్ ఉన్నాడు. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ వారి పాట‌లో న‌టిస్తున్నాడు. బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ మూవీ ఇద‌ని తెలుస్తోంది. ఈ మూవీ కోసం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేసి మ‌హేష్‌ ఫిజిక‌ల్ గా గొప్ప‌ మేకోవ‌ర్ ని తేవ‌డం ఆస‌క్తిక‌రం.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్- 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్ -జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.