Begin typing your search above and press return to search.

మహేష్ డైరెక్టర్.. మళ్ళీ అతనే సెట్టయ్యేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   26 Nov 2022 2:30 AM GMT
మహేష్ డైరెక్టర్.. మళ్ళీ అతనే సెట్టయ్యేలా ఉన్నాడు
X
మహేష్ బాబు తో ఇటీవల సర్కారు వారి పాట అనే సినిమా చేసిన కమర్షియల్ మాస్ దర్శకుడు పరుశురామ్ తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. కెరీర్లో స్టార్ డైరెక్టర్గా సక్సెస్ అందుకోవడానికి ఇతను చాలా ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో కేవలం సక్సెస్ మాత్రమే కాకుండా లాభాల్లో వాటా కూడా సొంతం చేసుకున్నాడు.

ఇక ఆ సినిమా చూసి మహేష్ బాబు ఎంతో నమ్మకంతో ఛాన్స్ ఇస్తే పరుశురాం మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. సర్కారు వారి పాట పై మహేష్ బాబు కూడా కొంత అప్సెట్ అయ్యాడు. అయితే పరుశురాం తదుపరి సినిమాతో మళ్లీ ఎలాగైనా సక్సెస్ అందుకొని ట్రాక్లోకి రావాలని అనుకుంటున్నాడు. అసలైతే మహేష్ బాబు కంటే ముందే అతను నాగచైతన్యతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.

కానీ మహేష్ బాబు హఠాత్తుగా పిలవడంతో నాగచైతన్య ప్రాజెక్టుగా పక్కకు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నాగ చైతన్య కూడా బాగానే సపోర్ట్ చేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ హీరో తోనే సినిమా చేయాలి అని పరశురామ్ ఆలోచిస్తున్నాడు.

ఇంతకుముందు అనుకున్న కథ మాత్రం సెట్ అవ్వలేదట. అందుకే మరొక తరహా కథను చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల 30 నిమిషాల పాటు ఒక కథ కాన్సెప్ట్ గురించి మొత్తం వివరించాడట.

అయితే లైన్ విని నాగచైతన్య చాలా బాగా ఎక్సైట్ అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే స్టోరీ లైన్ అయితే అదిరింది అని వీలైనంత తొందరగా పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ చేయమని అతనికి చెప్పాడట. ఇక వీరి కాంబినేషన్లో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వరకు ఒప్పందం కుదుర్చుకుంది.

కాబట్టి నిర్మాతతో పెద్దగా ఇబ్బంది లేదు. ఇక స్టోరీ మొత్తం రెడీ అయితే సినిమాను మొదలుపెట్టాలని పరుశురామ్ ఆలోచిస్తున్నాడు మరి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.