Begin typing your search above and press return to search.

మహేష్‌ బాబు ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్‌ కనిపించడు

By:  Tupaki Desk   |   26 Oct 2021 4:35 AM GMT
మహేష్‌ బాబు ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్‌ కనిపించడు
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో నిరాశ పర్చింది. రేటింగ్ పరంగా జెమిని టీవీ వారితో పాటు నందమూరి అభిమానులను కూడా అసంతృప్తికి గురి చేసింది. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఆలోచించనక్కర్లేదు. ఎన్టీఆర్‌ తదుపరి సీజన్ ను చేస్తాడనే నమ్మకంను ఏ ఒక్కరు వ్యక్తం చేయడం లేదు. పారితోషికం విషయంలో మరింత పెంచినా కూడా ఎన్టీఆర్‌ రేటింగ్‌ లేని షో ను చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బుల్లి తెరపై బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఆ సీజన్ కు మంచి రేటింగ్‌ వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల షో కు ఆయన కంటిన్యూ అవ్వలేక పోయాడు. ఇక ఎన్టీఆర్‌ చాలా నమ్మకం పెట్టుకుని ఎవరు మీలో కోటీశ్వరుడుకు ఓకే చెప్పాడు. కాని ఆయన షో ను జనాలు లైట్ తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు సెలబ్రెటీ గెస్ట్‌ లు వచ్చినప్పుడు మాత్రమే కాస్త రేటింగ్‌ వచ్చింది కాని సాదారణ ఎపిసోడ్స్ ను జనాలు అస్సలు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఎన్టీఆర్‌ ఈ సీజన్ ను అనుకున్న దాని కంటే కాస్త ముందుగానే ముగించేయాలని భావిస్తున్నాడట. మొదట అనుకున్న దాని ప్రకారం దీపావళికి మహేష్ బాబు ఎపిసోడ్‌ టెలికాస్ట్ అవ్వాల్సి ఉంది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు షో చివరి ఎపిసోడ్ గా మహేష్‌ స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందనే సమాచారం అందుతోంది.

నవంబర్ లో ఈ షో కు ఎండ్ కార్డ్‌ వేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరణ ను ఎన్టీఆర్‌ ముగించాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం మహేష్‌ బాబు ఎపిసోడ్స్ తో ఫుల్‌ స్టార్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ముందు ముందు సీజన్ లను ఆయన చేస్తాడనే నమ్మకం లేదు. కనుక ఈ సీజన్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఉండడు కనుక మహేష్‌ బాబు ఎపిసోడ్‌ లోనే ఎన్టీఆర్‌ ను బుల్లి తెరపై చూడటం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.