Begin typing your search above and press return to search.

టీఆర్పీ కోసం మ‌హేష్‌ ని రంగంలోకి దింపేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Sep 2021 11:30 AM GMT
టీఆర్పీ కోసం మ‌హేష్‌ ని రంగంలోకి దింపేస్తున్నాడు
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బిగ్‌ బాస్ త‌రువాత హోస్ట్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న షో `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు`. ఎన్టీఆర్ హాట్ సీట్‌ లో కూర్చుని `ఆట నాది.. కోటి మీది` అంటూ బుల్లితెర‌పై వ్యాఖ్య‌త‌గా త‌న‌దైన మార్కు హోస్టింగ్‌ తో ఆక‌ట్టుకుంటున్నారు. అయితే ఈ షోకి టీఆర్పీ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్‌ బాస్ సీజ‌న్ 5 స్టార్ట్ కావ‌డంతో ఈ రెండు షోల మ‌ధ్య నువ్వా నేనా అనే పోటీ న‌డుస్తోంది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం ఎన్టీఆర్ కొత్త ప్లాన్ వేశారు.

ఈ షో గ‌త కొన్ని రోజులుగా టీఆర్పీ కొంత నిరాశాజ‌న‌కంగా వుంద‌ట‌. దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ ఇటీవ‌ల ఈ షో కోసం రామ్‌ చ‌ర‌ణ్‌ ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ రాక‌తో ఈ షో టీఆర్పీ అమాంతం పెరిగి రికార్డుని సృష్టించింది. హాట్ సీట్‌ లో కూర్చున్న ఎన్టీఆర్, ..గెస్ట్టc‌గా ఎంట్రీ ఇచ్చిన రామ్ ‌చ‌ర‌ణ్ ఓ రేంజ్‌ లో అద‌ర‌గొట్టేశారు. ఇదే మ్యాజిక్‌ ని మ‌ళ్లీ ఎన్టీఆర్ రిపీట్ చేయాబోతున్నారు. సూప‌ర్ ‌స్టార్ మ‌హేష్‌బాబు, ..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒకే స్టేజ్‌ పై సంద‌డి చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

వీరి కాంబినేష‌న్‌ లో ఓ స్పెష‌ల్ ఎపిసోడ్ ‌ని ప్లాన్ చేసిన ప్ర‌ముఖ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ ఛానెల్ ఇందు కోసం ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ని ప్రారంభించిన‌ట్టుగా తెలుస్తోంది. ఒకే స్టేజ్‌ పై ఇద్ద‌రు క్రేజీ స్టార్‌ లు క‌నిపించి ఆడితే ఆ షో టీఆర్పీని ఓ రేంజ్ ‌లో రికార్డు సృష్టించడం ఖాయం. సోమ‌వారం ప్ర‌సారం కానున్న ప్ర‌త్యేక ఎపిసోడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ‌మౌళి, ..కొర‌టాల శి త‌మ ఆట‌తో మెప్పించ‌బోతున్నారు. కాగా ద‌స‌రా కానుక‌గా ప్ర‌సారం కానున్న ప్ర‌త్యేక ఎపిసోడ్ ‌లో మాత్రం సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ ‌బాబు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ తో క‌లిసి సంద‌డి చేనున్నార‌ట‌. ఇప్ప‌టికే మ‌హేష్ ఈ షోలో పాల్గొన‌డం కోసం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షూట్ జ‌ర‌గ‌నుందని స‌మాచారం. ఈ వార్త‌ల‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.