Begin typing your search above and press return to search.

తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న మహేష్...!

By:  Tupaki Desk   |   9 July 2020 6:30 AM GMT
తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న మహేష్...!
X
తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అగ్ర నటులలో 'నటశేఖరుడు' కృష్ణ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసి.. తన సినిమాలతో 'సూపర్ స్టార్‌'గా వెలుగొందారు. తన నటవారసుడిగా మహేష్ బాబుని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌ లో అడుగుపెట్టిన మహేష్ అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించాడు. మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరిగా తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల మెప్పుపొంది తండ్రి కృష్ణలా సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక చిన్నప్పటి నుంచి మహేష్ కు కృష్ణ తండ్రిగానే కాకుండా గురువులా అన్ని దగ్గరుండి నేర్పించారు. మహేష్ బాబు హీరోగా ఈ స్థాయికి ఎదగడంలో కృష్ణ ప్రమేయం చాలానే ఉంది. ఈ విషయాన్ని మహేష్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు.

ఈ క్రమంలో మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన తండ్రితో ఉన్న ఒక ఫోటో షేర్ మెమొరీస్ గుర్తు చేసుకున్నారు. ఈ ఫొటోలో మహేష్.. కృష్ణ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ''అతని ముఖం మీద ఉన్న చిరునవ్వు అన్నిటికంటే విలువైనది! #జ్ఞాపకాలు #throwbackthursday'' అని క్యాప్షన్ పెట్టారు మహేష్. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహేష్ - కృష్ణ లని చూస్తుంటే ఇది ఇంట్లో జరిగిన శుభకార్యం సందర్భంగా తీసుకున్న పిక్ అని తెలుస్తోంది. తమ అభిమానులు ఒక ఫొటోలో దర్శనమివ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

కాగా మహేష్ బాబు కెరీర్ పరంగాను దూకుడుగా వెళ్తున్నారు. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేయనున్నారు. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా రానున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.