Begin typing your search above and press return to search.

సరిలేరు..విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం!

By:  Tupaki Desk   |   4 Aug 2019 4:18 PM IST
సరిలేరు..విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు రత్నవేలు. ఈ సినిమా కోసం ఈ సినిమాటోగ్రాఫర్ అవలంబిస్తున్న కొత్త టెక్నిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది.

ఈమధ్య సినిమాల్లో గ్రాఫిక్స్ ను ఉపయోగించడం పెరిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒక భాగంగా మారిపోయింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన చిక్కేమింటంటే.. షూటింగ్ సమయంలో సినిమాటోగ్రాఫర్.. డైరెక్టర్.. నటీనటులు విజువల్ ఎఫెక్ట్స్ ను మనసులో ఊహించుకొని చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. ఇక గ్రాఫిక్స్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే కరెక్ట్ గా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే 'సరిలేరు నీకెవ్వరు' కోసం రత్నవేలు కొత్త టెక్నిక్ వాడుతున్నారట. షూట్ కు ముందే సిజీ ప్లేట్స్ వాడడం ద్వారా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ చిత్రీకరణ జరుపుతున్నారట. దీంతో గ్రాఫిక్స్ విషయంలో ముందే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈ విధానం యూనిట్ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉందట.

రత్నవేలు సీజీ ప్లేట్స్ టెక్నిక్ ఇప్పటికే మహేష్ ను కూడా ఎంతగానో మెప్పించిందట. అంతే కాకుండా టాలీవుడ్ లో ఇతర ఫిలింమేకర్లు ఈ టెక్నిక్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇది ఎలా వాడాలని కనుక్కోవడంతో పాటుగా తమ సినిమాలకు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. దీంతో ఒక్కసారిగా రత్నవేలు.. సరిలేరు టీమ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. ఒకవేళ ఈ టెక్నిక్ అందరూ వాడిన పక్షంలో టాలీవుడ్ లో విప్లవాత్మకమార్పుకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు.