Begin typing your search above and press return to search.

రాజ‌మౌళితో ప్రాజెక్ట్ పై మ‌హేష్ లో క్యూరియాసిటీ!

By:  Tupaki Desk   |   10 Aug 2021 8:34 AM GMT
రాజ‌మౌళితో ప్రాజెక్ట్ పై మ‌హేష్ లో క్యూరియాసిటీ!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నుందని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్  గురించి అధికారిక క‌న్ప‌ర్మేష‌న్ లేనే లేదు. జ‌క్క‌న్న ఏ విష‌యాన్ని ముందుగా చెప్ప‌రు. ప్రతిదీ రెడీ అయ్యి ప‌ట్టాలెక్కించిన త‌ర్వాత మీడియాకి దానంత‌ట అదే లీక్ అవ్వాలి త‌ప్ప ముందుగా భ‌జ‌న చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు. ప్ర‌స్తుతానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.

స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యాకే మహేష్ కానీ రాజ‌మౌళి కానీ అధికారికంగా సినిమాని ప్ర‌క‌టిస్తారు. ఒక‌వేళ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభ‌మైతే జాతీయ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా మోతెక్కించ‌డం ఖాయం.  అంచ‌నాలు ఆకాశాన్నంటుతాయి. అయితే ఆ టైమ్ ఎప్ప‌టికి వ‌స్తుంది అంటే.. ఇక ఆ సంద‌ర్భం వ‌చ్చేసిందనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  

జ‌క్క‌న్న‌తో సినిమా అనే విష‌యాన్ని మ‌మేష్ కూడా మ‌న‌సులో దాచుకోలేక‌పోతున్నార‌ని తాజా ఇన్సిడెంట్ చెబుతోంది.  ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 9న మ‌హేష్ ఈ విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి కాంబినేషన్ లో చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం రాబోతుంద‌ని వెల్ల‌డించారు.  అలాగే ఇది `బాహుబ‌లి` లాంటి  భారీ విజువ‌ల్ సినిమా కాద‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగ‌ని సాధార‌ణ సినిమా కూడా  కాదు.  అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసే స్థాయిలో జ‌క్క‌న్న స్క్రిప్ట్  ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళుతుంద‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న‌ `ఆర్.ఆర్.ఆర్` త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మ‌హేష్ నోట అధికారికంగానే ఆ మాట వినిపించింది కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా సెట్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అలా కాక‌పోతే మ‌హేష్ ఇప్పుడే స్పందించ‌రు క‌దా! అన్న విశ్లేష‌ణ సాగుతోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట`లో న‌టిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. అలాగే మ‌హేష్ -త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లోనూ మ‌రో సినిమా తెర‌కెక్కాల్సి ఉంది.  

వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ:

2022 సంక్రాంతికి మహేష్ బాబు `సర్కారు వారి పాట` విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలో విడుదలకు తేదీని లాక్ చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అలాగే స‌ర్కార్ వారి పాట శాటిలైట్ హక్కులను స్టార్ MAA సొంతం చేసుకుంది.

ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టిస్తారు. ఆ త‌ర్వాతా వ‌రుస‌గా ప‌లువురు క్రేజీ ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. అయితే త్రివిక్ర‌మ్ తో సినిమా పూర్త‌య్యేప్ప‌టికి రాజ‌మౌళి బౌండ్ స్క్రిప్టుతో మ‌హేష్ ని క‌లుస్తార‌ని కూడా అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. మ‌రోవైపు అల్లు రామాయ‌ణంలో మ‌హేష్ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది ట్ర‌యాల‌జీ కేట‌గిరీ సినిమా. అందువ‌ల్ల దీనికి లాక్ అయితే గ‌నుక మ‌హేష్ చాలా కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతున్నా ఆయ‌న ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ బాలీవుడ్ ద‌ర్శ‌కుడికి ఓకే చెప్ప‌లేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌లో మ‌హేష్ మైండ్ సెట్ పూర్తిగా మారుతుంద‌ని భావిస్తున్నారు.